Share News

Minster Atchannaidu: ఆహార భద్రత కల్పించేలా పరిశోధనలు

ABN , Publish Date - Jun 13 , 2025 | 05:32 AM

రైతులకు పెట్టుబడులు తగ్గేలా, అధిక దిగుబడులిచ్చే వండగాలను అభివృద్ధి చేయాలని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు శాస్త్రవేత్తలను కోరారు.

Minster Atchannaidu: ఆహార భద్రత కల్పించేలా పరిశోధనలు

  • రంగా వర్సిటీ వ్యవస్థాపక దినోత్సవంలో మంత్రి అచ్చెన్న

అమరావతి, జూన్‌ 12(ఆంధ్రజ్యోతి): రైతులకు పెట్టుబడులు తగ్గేలా, అధిక దిగుబడులిచ్చే వండగాలను అభివృద్ధి చేయాలని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు శాస్త్రవేత్తలను కోరారు. గురువారం గుంటూరు సమీపంలోని లాంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 62వ వ్యవస్థాపక దినోత్సవంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ‘ సేంద్రీయ వ్యవసాయంపై రైతులకు అవగాహన పెంచుతూ, రసాయన ఎరువుల వాడకం తగ్గించేలా కృషి చేయాలి. భూసార పరీక్షల కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఆహార భద్రత సాధించే దిశగా అత్యుత్తమ రకాలను రూపొందించాలి. ఈ విశ్వవిద్యాలయంలో పట్టభద్రులైన విద్యార్థులు దేశవిదేశాల్లో అత్యున్నత పదవుల్లో పని చేయడం ముదావహం’ అని మంత్రి అచ్చెన్న అన్నారు. వీసీ శారద జయలక్ష్మి, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌, డైరెక్టర్‌ డిల్లీరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐసీఏఆర్‌ టెక్నికల్‌ బులిటెన్‌ను మంత్రి ఆవిష్కరించారు. 2023-25లో ఉత్తమ సేవలందించిన పలువురు శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులకు అవార్డులు అందజేశారు.

Updated Date - Jun 13 , 2025 | 05:34 AM