Share News

NASSCOM: ఏపీని టెక్ హబ్‌గా నిలబెట్టేందుకు కృషి.. నాస్కామ్ బృందంతో సీఎం భేటీ

ABN , Publish Date - Jun 02 , 2025 | 10:26 PM

ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచంలోనే ప్రముఖ టెక్ హబ్‌గా నిలబెట్టడానికి సీఎం చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే సీఎం చంద్రబాబు నాస్కామ్ బృందంతో ఇవాళ అమరావతిలో సమావేశమయ్యారు.

NASSCOM: ఏపీని టెక్ హబ్‌గా నిలబెట్టేందుకు కృషి.. నాస్కామ్ బృందంతో  సీఎం భేటీ
NASSCOM

ఇంటర్నెట్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచంలోనే ప్రముఖ టెక్ హబ్‌గా నిలబెట్టడానికి సీఎం చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు. విద్యార్థుల్లో ప్రతిభను పెంచి రాష్ట్రంలో నూతన ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా రాష్ట్రాన్ని టెక్ హబ్‌గా నిలబెట్టడానికి వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగానే సీఎం చంద్రబాబు నాస్కామ్ బృందంతో ఇవాళ అమరావతిలో సమావేశమయ్యారు. సీఎంను కలిసిన నాస్కామ్ బృందంలో అధ్యక్షుడు రాజేష్ నంబియార్, ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ శ్రీనివాసన్, ER&D అధిపతి శివ ప్రసాద్ పొలిమెట్ల తదితరులు ఉన్నారు.

ప్రస్తుతం దేశంలో టెక్నాలజీ రంగం చాలా వేగంగా దూసుకుపోతోంది. ముఖ్యంగా జీసీసీలు (గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్), ఈఆర్‌&డీ (ఇంజినీరింగ్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్), ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)వంటివి కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే రద్దీగా మారిన నగరాలకు బదులుగా మన ఆంధ్రప్రదేశ్ ఒక గొప్ప ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని వారికి చంద్రబాబు వివరించారు. అందుకు తగ్గ తోడ్పాటును అందించాలని చంద్రబాబు కోరారు.


నాస్కామ్ (NASSCOM) మన దేశంలో సాఫ్ట్‌వేర్, సేవల రంగాల అభివృద్ధికి, ఆవిష్కరణలకు అండగా నిలిచే సంస్థ. రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, నైపుణ్యాలు, వసతులను ఎలా ఉపయోగించుకోవాలనేదానిపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది.

Updated Date - Jun 02 , 2025 | 10:28 PM