YS Sharmila: రీవ్యాలిడేషన్పై దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయ్
ABN , Publish Date - Jun 02 , 2025 | 04:10 AM
పదో తరగతి రీవ్యాలిడేషన్పై నారా లోకేశ్, వైఎస్ జగన్ మధ్య జరిగిన వాదనలపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్పందన ఇచ్చారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ విద్యావ్యవస్థను పాడుచేసారని ఆమె విమర్శించారు.

లోకేశ్, జగన్ మధ్య వాదనలపై షర్మిల ఎద్దేవా
అమరావతి, జూన్ 1(ఆంధ్రజ్యోతి): పదో తరగతి ఫలితాల రీవ్యాలిడేషన్పై ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య వాదనలు చూస్తుంటే.. దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా ఉన్నాయని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. ఆదివారం ఆమె ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేశారు. ‘వైసీపీ హయాంలో ఏటా రీకౌటింగ్లో ఫెయిలైన విద్యార్థుల్లో 20 శాతం మంది తిరిగి అధికమార్కులతో పాసయ్యారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో 30 వేల మందిలో 11 వేల మందికి తిరిగి ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చాయంటే, పేపర్ల మూల్యాంకనంలో చిత్తశుద్ధి ఎంతుందో అర్థమవుతోంది. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ విద్యావ్యవస్థను భ్రష్టుపట్టించారనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేంకావాలి. వాస్తవానికి ఫెయిలైంది విద్యార్థులు కాదు ..పేపర్లు దిద్దలేని నాటి వైసీపీ ఫెయిలైంది. ఇప్పుడు పూర్తిగా కూటమి ప్రభుత్వం ఫెయిలైంది. విద్యాశాఖ మంత్రిగా లోకేశ్ ఫెయిలైనట్లే. దీనిపై వెంటనే విచారణ చేయండి. పరీక్ష రాసిన ప్రతి విద్యార్థికీ ఉచితంగా వెరిఫికేషన్ చేయండి’ అని పేర్కొన్నారు.