Share News

Education Department: మోడల్‌ స్కూళ్లలో బదిలీలకు అనుమతి

ABN , Publish Date - Jun 13 , 2025 | 05:46 AM

మోడల్‌ స్కూళ్లలో ప్రిన్సిపాళ్లు, పీజీటీలు, టీజీటీల బదిలీలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌ గురువారం ఉత్తర్వులు జారీచేశారు.

Education Department: మోడల్‌ స్కూళ్లలో బదిలీలకు అనుమతి

అమరావతి, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): మోడల్‌ స్కూళ్లలో ప్రిన్సిపాళ్లు, పీజీటీలు, టీజీటీల బదిలీలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుత పాఠశాలలో ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్నవారు తప్పనిసరిగా బదిలీ కావాలి. రెండేళ్లు దాటినవారు రిక్వెస్ట్‌ బదిలీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. రెండేళ్ల లోపు రిటైర్‌ కాబోయే వారికి బదిలీల నుంచి మినహాయింపు ఉంటుంది. బదిలీల ప్రక్రియ వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా జరుగుతుంది. సాధారణ టీచర్ల తరహాలోనే నాలుగు కేటగిరీల్లో పాయింట్లు కేటాయిస్తారు. ఏడాదికి అర పాయింట్‌ చొప్పున సర్వీస్‌ పాయింట్లు ఇస్తారు. బదిలీల ప్రక్రియ చేపట్టడంపై మోడల్‌ స్కూల్స్‌ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.శివశంకర్‌రెడ్డి హర్షం వ్యక్తంచేశారు.

Updated Date - Jun 13 , 2025 | 05:48 AM