చంద్రబాబుతోనే అభివృద్ధి, సంక్షేమం
ABN , Publish Date - Jul 31 , 2025 | 12:25 AM
సీఎం చంద్రబాబుతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పేర్కొన్నారు.

పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి
కల్లూరు, జూలై 30(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబుతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పేర్కొన్నారు. బుధవారం పుసులూరు గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పల్లె ప్రభాకర్రెడ్డి, ఫైనాన్స కార్పొరేషన డైరెక్టర్ డి.రామాంజనేయులు, మాదేష్ పాల్గొన్నారు.