CM Chandrababu: కేంద్రం రైతులకు ఇచ్చే అమౌంట్కు సమానంగా జమ చేస్తాం, ఆ రోజు నుంచి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం: చంద్రబాబు
ABN , Publish Date - May 17 , 2025 | 05:17 PM
ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు పలు గుడ్ న్యూస్లు చెప్పారు. ఆగస్టు 15నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, కేంద్రం రైతులకు ఇచ్చే అమౌంట్కు సమానంగా జమ చేస్తామన్నారు.

CM Chandrababu: రైతన్నలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు. కేంద్రం ఇచ్చే కిసాన్ నగదుకు సరిసమానంగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేస్తామన్నారు. కర్నూలు(Kurnool) జిల్లా పాణ్యం నియోజకవర్గంలో స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu) పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీ క్యాంప్ రైతుబజార్కు ఆయన వెళ్లారు. అక్కడ రైతులు, పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడారు. కూరగాయల వ్యర్ధాలతో ఎరువుల తయారు చేసే విధానాన్ని పరిశీలించారు. అనంతరం ధనలక్ష్మి నగర్లో ఉద్యానవన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించాలంటూ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రతినెలా మూడో శనివారం ఇళ్లు, పరిసరాల్లోని శుభ్రతపై దృష్టిపెట్టాలని కోరారు. కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు.. స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్రలో భాగంగా ఈ మేరకు ప్రజలతో ప్రమాణం చేయించారు. రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించాలని ప్రజలకు సూచించారు. ఉద్యోగులు సైతం ప్రతి మూడో శనివారం శుభ్రతపై దృష్టిపెట్టాలన్నారు. ప్రపంచం మెచ్చుకునేలా రాష్ట్రంలో యోగా కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్లు చంద్రబాబు తెలిపారు. కర్నూలులోని రైతుబజార్కు రూ.6కోట్లు కేటాయించి ఆధునికీకరిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
కర్నూలు ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంకా ఏం మాట్లాడారంటే.. "రాష్ట్రంలో 125 రైతు బజార్లు ఉన్నాయి. కాలక్రమంలో వాటిపై దృష్టి పెట్టలేదు. వీటిని ఆదర్శ రైతు బజార్లుగా తయారు చేస్తాం. 175 నియోజకవర్గాల్లో 175 రైతు బజార్లు ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర, ప్రజలకు సరసమైన ధరలకు కూరగాయలు అందిస్తాం. మూడో శనివారం ఎవరూ ఆఫీసుల్లో పని చేయొద్దు. ఆఫీసును శుభ్రం చేసి పచ్చని చెట్ల కింద విశ్రాంతి తీసుకోవాలి. వైజాగ్లో ప్రధాని మోదీ ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని ప్రపంచం మెచ్చేలా నిర్వహిస్తాం. సెల్ ఫోన్ ప్రభావం వల్ల పిల్లలు, పెద్దలు అనారోగ్యానికి గురవుతున్నారు. యోగా వల్ల ఆరోగ్యంగా ఉంటారు." అని చంద్రబాబు అన్నారు
"ప్రపంచంలో ఏదీ వేస్ట్ కాదు. ప్రతి ఒక్కటీ విలువైనదే. తడి చెత్త, పొడి చెత్త కాన్సెప్ట్ ను తీసుకొచ్చి పవర్ గ్రిడ్ కు శ్రీకారం చుట్టాను. ప్రస్తుతం ఇవి రెండు ఉన్నాయి. గత ప్రభుత్వం 84 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను రోడ్లపై వదిలేసింది. మంత్రి నారాయణను అక్టోబర్ రెండో తేదీ నాటికి ఆ చెత్తను తొలగించాలని ఆదేశించా. ఇప్పటివరకూ రోడ్లపై 54 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించారు. మెప్మా డ్వాక్రా సంఘాలను సమన్వయం చేస్తా. సుధారాణి అనే మహిళ మిద్దె తోటలపై ప్రపంచవ్యాప్తంగా విప్లవం తీసుకొచ్చారు. డ్వాక్రా సంఘాల ద్వారా ప్రపంచానికి ఆడ బిడ్డల శక్తి ఏమిటో తెలియజేశాం. చెత్త నుంచి కంపోస్టు ఎరువులను తయారు చేసి రైతులకు సప్లే చేసే బాధ్యత డ్వాక్రా సంఘాలకు అప్పగిస్తున్నా." అని చంద్రబాబు తెలిపారు.
"జపాన్ లో రోడ్లపై ఎక్కడ చెత్త కనపడదు. రోడ్లపై ఉన్న పేపర్లను ఇంటికి తీసుకెళ్లి డస్ట్ బిన్ లో వేయడం సామాజిక బాధ్యత. పల్లె పుష్కరిణి అనే కార్యక్రమం ద్వారా చెరువులు శుభ్రం చేసి చెరువు చుట్టూ పచ్చదనం ఉండేలా చూస్తాం. అనంతపురం జిల్లాలో ఓడిఎఫ్ గ్రామాలు సక్సెస్ అయింది. దేశంలోనే ఎక్కడా లేనిది మన రాష్ట్రంలో త్వరలో పేదల సేవలో అనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా. త్వరలోనే దీపం పథకం లబ్ధిదారులకు డబ్బులు అకౌంట్లలో జమ చేస్తాం. డిఎస్సీ ద్వారా 16,500 ఉద్యోగాలను స్కూల్లు ఓపెన్ చేసే లోపు పూర్తి చేస్తాం. ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ పాఠశాలలు తెరిచే లోగా తల్లికి వందనం ఇస్తామని చంద్రబాబు చెప్పారు.
ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
"నాకు ఎన్ని కష్టాలు వచ్చినా భరిస్తా.. కానీ ప్రజలకు కష్టాలు రానివ్వను. కేంద్రం రైతులకు ఇచ్చే నగదుకు సమానంగా మూడు విడతల్లో రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేస్తాం. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. నేనూ రాయలసీమ బిడ్డనే. రాయలసీమను రతనాల సీమ చేయడమే నా లక్ష్యం. రాయలసీమలో ఒకప్పుడు ఫ్యాక్షన్ సంస్కృతి ఉండేది. దాన్ని కూకటివేళ్లతో పెకిలించా. దీనివల్ల అభివృద్ధికి అవకాశం ఏర్పడింది. రాయలసీమ నాలుగు జిల్లాల్లో నాలుగు ఎయిర్ పోర్టులు ఉన్నాయి. దేశంలో ఎక్కడా నాలుగు జిల్లాల్లో నాలుగు ఎయిర్ పోర్టులు లేవు. త్వరలోనే ఓర్వకల్లు మండలంలోని గ్రీన్ ఎనర్జీ సంస్థ నుంచి దేశవ్యాప్తంగా కరెంటు సరఫరా కానుంది.
మండు వేసవిలో కూడా రాయలసీమ చెరువుల్లో నీరు నిండుగా ఉంది. ఇది నా చొరవ. పోలవరం - బనకచర్ల అనుసంధానం గేమ్ చేంజర్ కానుంది. దీని ద్వారా రాయలసీమ లోని ప్రతి ఎకరాకు నీరు అందించవచ్చు.
ఓర్వకల్లు పారిశ్రామిక వాడకు నీళ్లు, రైల్వే ట్రాక్ తీసుకొచ్చే బాధ్యత నాది. కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని 16 వార్డుల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం." అని చంద్రబాబు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
Penny Stock: ఐదేళ్లలోనే రూ.15 నుంచి రూ.246కి చేరిన స్టాక్..ఇన్వెస్టర్లకు లాభాలే లాభాలు..
Intraday Trading: స్టాక్ మార్కెట్ ఇంట్రాడేలో ఎంత మంది నష్టపోతున్నారో తెలుసా..
Pakistan GDP: పాకిస్థాన్ జీడీపీ ఎంతో తెలుసా.. మన దగ్గరి ఒక్క రాష్ట్రం చాలు..
Personal Loan: పర్సనల్ లోన్ తీసుకుని ఆర్నేళ్లు కట్టకపోతే జైలుకు పంపిస్తారా..రూల్స్ ఏం చెబుతున్నాయ్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
డ్రోన్ పటాసులు ఎలా ఉన్నాయ్..