Share News

Vamsi Remand News: వంశీకి మళ్లీ నిరాశే.. మరికొన్ని రోజులు

ABN , Publish Date - May 07 , 2025 | 04:58 PM

Vamsi Remand News: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి నిరాశే ఎదురైంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నేటితో వంశీ రిమాండ్ ముగిసింది.

Vamsi Remand News: వంశీకి మళ్లీ నిరాశే.. మరికొన్ని రోజులు
Vamsi Remand News

విజయవాడ, మే 7: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని (Former MLA Vallabhaneni Vamsi) కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. వంశీ రిమాండ్‌ను మరోసారి పొడిగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. పలు కేసుల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీ.. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో ఉన్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ రిమాండ్ నేటితో ముగిసింది. దీంతో ఈరోజు ఆయనను పోలీసులు జిల్లా జైలు నుంచి తీసుకుని సీఐడీ కోర్టులో హాజరుపరిచారు. వంశీకి ఈనెల 21 వరకు రిమాండ్ పొడిగించింది కోర్టు. ఆ వెంటనే ఆయనను తిరిగి జిల్లా జైలుకు తరలించారు పోలీసులు.


నిన్న (మంగళవారం) సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో వంశీకి ఎదురుదెబ్బే తగిలింది. ఈ కేసులో రిమాండ్ ముగియడంతో వంశీని విజయవాడ కోర్టులో హాజరుపర్చగా.. ఈనెల 13 వరకు రిమాండ్‌ను పొడిగించింది న్యాయస్థానం. ఈ కేసులో వంశీతో పాటు వెలినేని శివరామకృష్ణ ప్రసాద్, గంటా వీర్రాజు, నిమ్మ చలపతి, వేల్పూరు వంశీబాబు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. నిన్న వీరందరి రిమాండ్ ముగియడంతో కోర్టులో హాజరుపర్చగా.. రిమాండ్‌ను పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో పరారీలో ఉన్న పలువురిని పట్టుకునేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. కాగా.. వంశీని కుటుంబసభ్యులతో గంట పాటు మాట్లాడేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.

Operation Abhyas Live Updates: హైదరాబాద్‌లో మోగిన సైరన్లు..


పీఎస్సార్‌కు కూడా
psr-jail.jpg

అలాగే నటి కాదంబరి జెత్వానీ కేసులో (Jethwani Case) అరెస్ట్ అయిన పీఎస్సార్ ఆంజనేయులు (PSR Anjaneyulu) రిమాండ్‌ను కోర్టు పొడిగిచింది. ఈ కేసులో నేటితో పీఎస్సార్ ముగియడంతో సీఐడీ కోర్టులో ఆయనను హాజరుపర్చారు అధికారులు. ఈ క్రమంలో పీఎస్సార్‌కు ఈనెల 21 వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. కాగా.. జెత్వానీ కేసులో అరెస్ట్ అయిన పీఎస్సార్‌పై మరో కేసు కూడా నమోదు అయిన విషయం తెలిసిందే. ఏపీపీఎస్సీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో గ్రూప్ 1 మెయిన్స్ మూల్యాంకణలో అవకతవకలు జరిగాయనీ, ఏపీపీఎస్సీలో పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారంటూ ఫిర్యాదులు రావడంతో పీఎస్సార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. విజయవాడ సూర్యారావు పేట పోలీస్‌స్టేషన్‌లో మోసం, నిధుల దుర్వినియోగం, నేరపూరి కుట్ర సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది.


ఇవి కూడా చదవండి

Operation Sindoor: అందుకే.. ఆపరేషన్ సింధూర్‌.. త్రివిధ దళాల రియాక్షన్ ఇదే..

Operation Sindoor: ఎయిర్‌లైన్స్ కీలక ప్రకటన.. ఆ ప్రాంతాల్లో విమానాశ్రయాలు బంద్

Read Latest AP News And Telugu News

Updated Date - May 07 , 2025 | 05:06 PM