Share News

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై ప్రముఖుల ప్రశంసలు..

ABN , Publish Date - May 07 , 2025 | 12:31 PM

Operation Sindoor: ఆపరేషన్‌ సిందూర్ విజయవంతమైనందుకు పలువురు రాజకీ, సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జై హింద్.. జై భారత్.. భారత్‌ మాతా కీ జై అంటూ సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా పోస్ట్‌లు పెడుతున్నారు.

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై ప్రముఖుల ప్రశంసలు..
Operation Sindoor

అమరావతి: ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor) పేరుతో పాకిస్థాన్‌ (Pakistan)లోని ఉగ్రస్థావరాల (Terrorist Bases)పై భారత సైనికులు (Indian Armed Forces) మెరుపు దాడి చేసి.. 9 స్థావరాలను ధ్వంసం చేశారు. దీనిపై రాజకీయ రంగ ప్రముఖులే కాకుండా సినీ రంగ ప్రముఖులు కూడా దీనిపై స్పందిస్తూ హర్షం వ్యక్తంచేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా భారత్‌ మాతా కీ జై అంటూ ట్వీట్లు పెడుతున్నారు. మేమంతా మీ వెంటే ఉంటామంటూ భారత్‌ సైన్యంను ఉద్దేశిస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు.


దశాబ్దాలుగా సహనం.. సహనం..

ఆపరేషన్‌ సిందూర్ విజయవంతమైనందుకు ఆనందంగా ఉందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు. దశాబ్దాలుగా సహనం.. సహనం.. మితిమీరిన సహనంతో చేతులు కట్టేసిన సమస్త భారత్‌కు ఆపరేషన్ సింధూర్‌తో తిరిగి భారత సమాజంలో వీరత్వాన్ని నింపిన త్రివిధ దళాధిపతులకు, వారికి వెన్నంటి నిలబడ్డ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ‘మీ వెన్నంటే మేము’ అంటూ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.

Also Read: పహల్గామ్ దాడిలో మరో కుట్ర..


హర్షణీయం షర్మిలా రెడ్డి..

పాక్ ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరుతో ప్రతి దాడులు చేయడం హర్షణీయమని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు. ఇది దేశానికి గర్వకారణమని పేర్కొంటూ.. భారత సైన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ‘జై హింద్.. జై భారత్’ అంటూ షర్మిలా రెడ్డి ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు.

పోరాటం ఇప్పుడే ప్రారంభమైంది.. రజనీకాంత్‌

పాకిస్తాన్‌పై పోరాటం ఇప్పుడే ప్రారంభమైందని లక్ష్యం పూర్తయ్యేవరకూ ఆగదని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పేర్కొన్నారు. దేశం మొత్తం మీతోనే ఉందని.. జైహింద్‌ అంటూ రజనీకాంత్‌ ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు. అలాగే జై హింద్‌ కీ సేనా.. భారత్‌ మాతాకీ జై.. అంటూ రితేశ్‌ దేశ్‌ముఖ్‌ ట్వీట్ చేశారు. కాగా న్యాయం జరిగిందని, భారత్‌ మాతా కీ జై అంటూ సినీ నటి ఖుష్బూ ట్వీట్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆపరేషన్ సింధూర్‌పై చిరంజీవి ట్వీట్

ఎమర్జెన్సీ ప్రకటించిన పాకిస్తాన్..

Rahul Gandhi: సాయుధ దళాలను చూసి గర్వపడుతున్నా..

For More AP News and Telugu News

Updated Date - May 07 , 2025 | 12:32 PM