Share News

ఘనంగా నృత్య దినోత్సవం

ABN , Publish Date - Apr 28 , 2025 | 12:26 AM

దృశ్యవే దిక సాంస్కృతిక సంస్థ అధ్వర్యంలో ఆదివారం సాయంత్రం వెలిదం డ్ల హనుమంతరాయ గ్రంథాలయం ప్రాంగణంలో అంతర్జాతీయ నృ త్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

ఘనంగా నృత్య దినోత్సవం
నృత్యకారిణుల ప్రదర్శన

విజయవాడ కల్చరల్‌, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): దృశ్యవే దిక సాంస్కృతిక సంస్థ అధ్వర్యంలో ఆదివారం సాయంత్రం వెలిదం డ్ల హనుమంతరాయ గ్రంథాలయం ప్రాంగణంలో అంతర్జాతీయ నృ త్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 70 మంది శాస్ర్తీయ నర్తకులు తమ అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. సీనియర్‌ కూచిపూడి నాట్యాచార్యులు వేదాంతం పాండురంగ శర్మ, యువ కూచిపూడి నర్తకి గోనుగుంట సత్యానందినిని దృశ్యవేదిక నిర్వాహకులు సత్కరించారు. ముఖ్య అతిథిగా హ్యాపీ రిసార్ట్స్‌ అండ్‌ రిక్రియేషన్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అంబటి మధుమోహనకృష్ణ విచ్చేశారు. సంస్థ ఉపాధ్యక్షుడు దొంతాల ప్రకాష్‌, డాక్టర్‌ హి మసాగర చంద్రమూర్తి, ఎన్‌ఎ్‌సఆర్‌ మూర్తి పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2025 | 12:26 AM