Share News

Kethireddy: మా నేతలపై కేసులు కామన్‌

ABN , Publish Date - Jun 15 , 2025 | 05:14 AM

కూటమి ప్రభుత్వంలో రానున్న నాలుగేళ్లు వైసీపీ నాయకులపై కేసులు పెట్టడం కామన్‌గా మారుతుంది అని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరమణారెడ్డి అన్నారు.

Kethireddy: మా నేతలపై కేసులు కామన్‌

  • జైళ్లను మంచి కండిషన్‌లో పెట్టండి

  • ప్రభుత్వం మారిన తరువాత టీడీపీ నేతలకు పనికొస్తాయి: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి

  • జైలులో కాకాణితో పెద్దిరెడ్డి సహా నేతల ములాఖత్‌

నెల్లూరు(క్రైం), జూన్‌ 14(ఆంధ్రజ్యోతి): ‘కూటమి ప్రభుత్వంలో రానున్న నాలుగేళ్లు వైసీపీ నాయకులపై కేసులు పెట్టడం కామన్‌గా మారుతుంది’ అని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరమణారెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో శనివారం పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డిలతో కలసి కేతిరెడ్డి ములాఖత్‌ అయ్యారు. అనంతరం మీడియాతో కేతిరెడ్డి మాట్లాడుతూ... ‘కూటమి ప్రభుత్వంలో విద్యాసంస్థల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించలేరు. కనీసం జైల్లో అయినా మంచి సౌకర్యాలు కల్పిస్తే ప్రభుత్వం మారిన తర్వాత టీడీపీ నేతలు జైలుకు వచ్చినప్పుడు పనికొస్తాయి’ అని అన్నారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ... ‘గతంలో ఎప్పుడు లేనివిధంగా దొంగలకు పోలీసులు పీటీ వారెంట్లు వేసినట్లు ఈ ప్రభుత్వంలో రాజకీయ నాయకులపై పోలీసులు పిటీ వారెంట్లు వేస్తున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - Jun 15 , 2025 | 05:17 AM