పదోన్నతుల తర్వాతే బదిలీలు చేపట్టండి
ABN , Publish Date - Jun 14 , 2025 | 12:03 AM
సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు నిర్వహించి ఆ తర్వాత బదిలీలు చేపట్టాలని ప్రొద్దుటూరు తాలూకా ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షుడు కేజే రఘురామిరెడ్డి పేర్కొన్నారు.

ప్రొద్దుటూరు టౌన్, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు నిర్వహించి ఆ తర్వాత బదిలీలు చేపట్టాలని ప్రొద్దుటూరు తాలూకా ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షుడు కేజే రఘురామిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సచివాలయ ఉద్యోగుల బదిలీలలో ఉన్న అభ్యంతరాలపై మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డితో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులను మున్సిపల్ పరిధిలోనే ఒక వార్డు నుంచి మరో వార్డుకు, ఒక పంచాయతీ నుంచి మరో పంచాయతీకి బదిలీ చేయాలని పేర్కొన్నారు. దీనిపై పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. మున్సిపల్ కమిషనర్గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన రవిచంద్రారెడ్డిని ఎన్జీవో అసోసియేషన్ నాయకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభంజన్రెడ్డి, కిరణ్, ప్రభాకర్, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
ఉద్యోగులు, సిబ్బంది