Share News

నకిలీ పట్టాలపై ప్రత్యేక దృష్టి సారించాలి :ఎస్పీ

ABN , Publish Date - Jun 14 , 2025 | 12:01 AM

బద్వేలులో నకిలీ పట్టాల వ్యవహారంపై ప్రత్యేక దృష్టిసారించాలని జిల్లా ఎస్పీ ఈజీ అశోక్‌కుమార్‌ పోలీసు అధికా రులను ఆదేశించారు.

నకిలీ పట్టాలపై ప్రత్యేక దృష్టి సారించాలి :ఎస్పీ
బద్వేలు రూరల్‌ పోలీసుస్టేషనను పరిశీలిస్తున్న ఎస్పీ అశోక్‌కుమార్‌

బద్వేలు, జూన 13 (ఆంధ్రజ్యోతి):బద్వేలులో నకిలీ పట్టాల వ్యవహారంపై ప్రత్యేక దృష్టిసారించాలని జిల్లా ఎస్పీ ఈజీ అశోక్‌కుమార్‌ పోలీసు అధికా రులను ఆదేశించారు. పట్టణంలోని అర్బన, రూరల్‌ పోలీసుస్టేషనలను శుక్రవారం జిల్లా ఎస్పీ ఈజీ అశోక్‌కుమార్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించి అర్బన సీఐ రాజగోపాల్‌, రూరల్‌ ఎస్‌ఐ శ్రీకాంత, ఎస్‌ఐలు సత్యనారాయణ,జయరామిరెడ్డిలకు పలు సూచనలు ఇచ్చారు. ఎవరైనా నకిలీ పత్రాలతో పోలీసుస్టేషనకు వస్తే వెంటనే కేసు నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. బద్వేలు పట్టణంలోని ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టిసారించి చర్యలు చేపట్టాలన్నారు. పోలీసుస్టేషనకు వచ్చే ఫిర్యాదుదారులను గౌరవించి వీలైనంత త్వరగా ఫిర్యాది సమస్యను పరిష్కరించాలన్నారు. శాంతి భద్రతలపై చర్యలు చేపట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. రాత్రివేళలో గస్తీ ముమ్మరం చేసి చోరీలపై నిఘాపెట్టాలన్నారు.

Updated Date - Jun 14 , 2025 | 12:01 AM