Share News

తల్లికి వందనం..ఇంటింటా ఆనందం

ABN , Publish Date - Jun 13 , 2025 | 11:59 PM

రాష్ట్ర ప్రభుత్వం ఒకటి నుంచి ఇంటర్‌ వరకు చదువు తున్న విద్యార్థులకు తల్లి వందనం పథకం కిం ద రూ.13వేలు తల్లి ఖాతాలో గురువారం జమ చేయడంతో ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరు స్తోంది.

తల్లికి వందనం..ఇంటింటా ఆనందం
చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నేతలు

జమ్మలమడుగు, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి):రాష్ట్ర ప్రభుత్వం ఒకటి నుంచి ఇంటర్‌ వరకు చదువు తున్న విద్యార్థులకు తల్లి వందనం పథకం కిం ద రూ.13వేలు తల్లి ఖాతాలో గురువారం జమ చేయడంతో ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరు స్తోంది. ఇద్దరు, ముగ్గురు పిల్లలు ఉన్న తల్లుల ఖాతాలో రూ.26వేలు, రూ.39వేలు జమకావ డంతో వారంతా ముఖ్యమంత్రి నారాచంద్రబా బునాయుడు, విద్యాశాఖా మంత్రి నారాలోకేశకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. కాగా జమ్మలమడుగు పాత బస్టాండులో గాంధీ విగ్రహం వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చిత్రపటానికి టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆద్వర్యంలో శుక్రవారం టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు, కూటమి నాయకులు క్షీరాభిషేకం చేశారు. ప్రభుత్వం తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా ఒక్కొక్కరికి రూ.13 వేలు జమ చేసి ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారన్నారు. సూపర్‌-6 పథకాల్లో బాగంగా అన్ని హామీలను చంద్రబాబు ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ వస్తుండ డంతో వైసీపీ నేతల్లో భయం ఏర్పడిందన్నారు. కార్యక్రమంలో టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి నవీన్‌రాయల్‌, టీడీపీ నాయీబ్రాహ్మణ కడప పార్లమెంటు అధ్యక్షుడు గజ్జెల గోవిందు, టీడీపీ నాయకులు ఐఎల్‌ చిన్న, నాని, సిద్దూరాయల్‌, అధ్యక్షుడు చామంతి మహేష్‌, పార్థసారధి, ప్రసాద్‌, ప్రతాప్‌, మధు పాల్గొన్నారు.

ప్రతి ఇంటిలో పండుగే..

ఖాజీపేట, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): తల్లికి వందనం పథకంకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిధులిచ్చి తల్లుల ఖాతాల్లో జమ చేయడంతో ప్రతి ఇంటిలో పండుగ వాతావరణం నెలకొందని టీడీపీ మండలాధ్యక్షుడు తిప్పిరెడ్డి లక్ష్మిరెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని పుల్లూరు దళితవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ, ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వంలో ఒక్కరికి మాత్రమే డబ్బులు వచ్చేవని, చంద్రబాబునాయుడు ముగ్గురు పిల్లలు ఉన్నా డబ్బులు వారి ఖాతాల్లో జమ చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ప్రతాప్‌రెడ్డి, కేసీకెనాల్‌ డిసి్ట్రబ్యూటరీ కమిటీ ఛైర్మన్‌ రవి, నంద్యాల సుబ్బయ్య, చుట్టే రాము, మామిళ్ల క్రిష్ణారెడ్డి, పల్లె గంగాధర్‌, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

సంతోషం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు

రాజుపాలెం, జూన 13 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం సూపర్‌సిక్స్‌లో భాగంగా తల్లికి వంద నం పథకం కింద తల్లుల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.13వేలు జమ చేయడంతో శుక్రవారం తల్లి దండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మండ లంలో 39 స్కూళ్లలో 2వేల మంది పైబడ విద్యా ర్థులు 1వతరగతి నుంచి ఇంటర్‌ వరకు విద్యనభ్యసిస్తున్నారు. తల్లుల ఖాతాల్లో అమౌం టు పడుతుండడంతో తల్లులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు కావాల్సిన నోటు పుస్తకా లు తదితర వాటిని కొనుగోలు చేసుకునేందుకు ఇది మంచి సదవకాశమని వారు తెలిపారు.

తల్లికి వందనం డబ్బులు జమ

మైదుకూరు రూరల్‌ ,జూన్‌ 13(ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం సూపర్‌ సిక్స్‌ పథకాల అమలు లో భాగంగా తల్లికి వందనం పథకం కింద తల్లుల అకౌంట్లలో శుక్రవారం డబ్బులు జమ అయ్యాయి.ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా ఒక్కొక్కరికి రూ.13 వేల చొప్పున అకౌంట్‌లో జమ అవుతున్నాయి.

మైదుకూరు, మున్సిపాలిటీ, మండలంలో చాలా వరకు తల్లుల అకౌం ట్‌లో డబ్బులు జమ అవుతున్నాయి. పాఠశాల ఓపెన్‌ చేసే సమ యంలో డబ్బులు పడటంతో పిల్లల పుస్తకాలకు ,స్కూల్‌ ఫీజులకు డబ్బులు చాలా బాగ ఉపయోగపడుతున్నాయని తల్లిదండ్రులు చెబు తున్నారు.

సీఎం చంద్రబాబు సార్‌కు థ్యాంక్స్‌

మా కుమారుడు చరణ్‌ 8వ తరగతి చదువుతు న్నాడు.తల్లికి వందనం డబ్బులు పుస్తకాలకు, స్కూల్‌ ఫీజుకు చాలా ఉపయోగ పడుతోంది. సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు.

- కుమారుడితో తుపాకుల కొండమ్మ,మైదుకూరు

చంద్రబాబు మాట నిలుపుకొన్నారు

మాకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఒక్కరికే అమ్మవడి పథకం ద్వారా డబ్బులు అకౌంట్లలో పడేవి. కాని సీఎం చంద్ర బాబు హామీ ఇచ్చిన మేరకు మా ఇద్దరు పిల్లలకు తల్లికి వందనం 26 వేల రూపాయలు అకౌంట్‌లో పడ్డాయి. సీఎం చంద్రబాబు మాట నిలుపుకొన్నారు.

- ఇద్దరు పిల్లలతో సునీత ,మైదుకూరు

Updated Date - Jun 13 , 2025 | 11:59 PM