విద్యార్థులకు సన్నబియ్యంతో నాణ్యమైన భోజనం
ABN , Publish Date - Jun 13 , 2025 | 12:13 AM
మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న పాఠశాలల విద్యార్థులకు సన్నబియ్యంతో నాణ్యమైన భోజనాన్ని పెడుతున్నట్లు ఎంపీడీవో వీరకిశోర్ తెలిపారు.

చాపాడు, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న పాఠశాలల విద్యార్థులకు సన్నబియ్యంతో నాణ్యమైన భోజనాన్ని పెడుతున్నట్లు ఎంపీడీవో వీరకిశోర్ తెలిపారు. చాపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం వీరకిశోర్, ఎంఈవోలు రవిశంకర్, వంశీకృష్ణ తనిఖీ చేశారు. సన్నబియ్యంతో తయారు చేసిన భోజనం, కోడిగుడ్లు వంటలను వారు తిని బాగుందని చెప్పారు. హెడ్మాస్టర్లు మెనూ తప్పకుండా పాటించాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నాణ్యమైన భోజనాలు పెడుతున్నట్లు వారు తెలిపారు. ఆ పాఠశాల హెడ్మాస్టర్ వెంకటలక్ష్మిని అడిగి విద్యార్థుల సంఖ్యను తెలుసుకున్నారు.