కొత్త బస్టాండు నిర్మాణం అంతేనా..?
ABN , Publish Date - Jun 14 , 2025 | 11:27 PM
మండల కేంద్రమైన కొండాపురంలో బస్టాండ్ లేక పోవడం తో ప్రజలు తీవ్రఇబ్బందులు పడుతున్నారు.

కొండాపురం, జూన 14 (ఆంధ్రజ్యోతి) : మండల కేంద్రమైన కొండాపురంలో బస్టాండ్ లేక పోవడం తో ప్రజలు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఉన్న బస్టాండు గండికోట ప్రాజెక్టు కింద ముంపునకు గురయ్యింది. బైపాస్లో కొత్త గా కొండాపురం గ్రామం ఏర్పడి దాదాపు ఐదేళ్లు పూర్తికావస్తున్నా ఇంతవరకు ముంపునకు గురైన బస్టాండు స్థానంలో తిరిగి ఆర్టీసీ నిర్మాణాన్ని చేపట్టలేదు. ఓబన్నపేట సమీపంలో దాతలు స్థలాన్ని ఇచ్చినా ఇంతవరకు బస్టాండు నిర్మాణా నికి అడుగులు పడలేదు. అసలు బస్టాండు ఎక్క డ నిర్మిస్తారో? కూడా ఇంతవరకు క్లారీటీ లేదు. వైసీపీ ప్రభుత్వంలో బస్టాండు నిర్మాణం గురించి అసలు పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం రావడంతో ఆర్టీసీ బస్టాండు నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
బస్టాండ్ లేక ప్రజల అవస్థలు
కొండాపురంలో బస్టాండ్ లేక పోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. పస్తుతం కొండాపురం లో రెండు చోట్ల బస్సులకు స్టాపింగ్ ఇచ్చారు. ఒకటి సీఎంఆర్ కాంప్లెక్స్ కాగా మరొకటి స్టేట్ బ్యాంక్ వద్ద స్టాపింగ్ ఉంది. దీంతో పాటు బస్టాండుకు దాతలు స్థలాన్ని కేటాయించిన ఓబన్నపేట ప్రాంతంలో కూడా స్టాపింగ్ ఉంది. ప్రస్తుతం పులివెందులకు వెళ్లే ఆర్డీనరి బస్సులు ఇక్కడికి వచ్చి వెళుతున్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం కొండాపురం మీదుగా వెళ్లే రహదారి నేషనల్ హైవేగా మారింది. దీంతో ఈ వైపు అనే క బస్సులు వెళుతున్నాయి. బస్టాండ్ లేక పోవ డంతో ఏ బస్సు ఎప్పుడు వెళుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొందని ప్రయాణికులు వాపోతున్నారు. వెంటనే ఆర్టీసీ బస్టాండు నిర్మా ణం చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.
బస్టాండ్ నిర్మాణం వెంటనే చేపట్టాలి
కొండాపురంలో బస్టాండు లేక ప్రజలు ఇబ్బందు లు పడుతున్నారు. బస్టాండు లేక పోవడంతో స్టాపింగ్ల్లో కూర్చోవడానికి కనీసం షెల్టర్లు కూ డా లేవు. ఏ బస్సు ఎప్పుడు వెళుతుందో ప్రజలు తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ముంపున కు గురైన బస్టాండు స్థానంలో వెంటనే ఆర్టీసీ బస్టాండు నిర్మాణం చేపట్టాలి.
-ఎం.మనోహర్బాబు,
సీపీఐ మండల కార్యదర్శి, కొండాపురం