సీఎం సహాయ నిధి పంపిణీ
ABN , Publish Date - Jul 30 , 2025 | 11:19 PM
సీఎం సహాయ నిధి ద్వారా దగ్గుపాటి పురందేశ్వరి సహకారంతో జిల్లా బీజేపీ అధ్యక్షుడు సాయిలోకేశ రాజంపేట మండలం మందరం గ్రామానికి చెందిన చాపల ఈశ్వరమ్మకు రూ.60వేల చెక్కును అందజేశారు.

రాజంపేట, జూలై 30 (ఆంధ్రజ్యోతి) : సీఎం సహాయ నిధి ద్వారా దగ్గుపాటి పురందేశ్వరి సహకారంతో జిల్లా బీజేపీ అధ్యక్షుడు సాయిలోకేశ రాజంపేట మండలం మందరం గ్రామానికి చెందిన చాపల ఈశ్వరమ్మకు రూ.60వేల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సీఎం సహాయనిధి ద్వారా ఆర్థికసాయం అందజేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. నరసింహరాజు, కృష్ణయాదవ్, సునీతానారాయణవర్మ, ప్రసాద్రెడ్డి, రమణయ్య, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.