Gummadi Sandhya Rani: మనుషులా? మృగాలా?
ABN , Publish Date - Jun 11 , 2025 | 05:32 AM
మహిళలను సంకర జాతి అంటారా? ఇంత నీచులా? మనుషులా? మృగాలా..! సజ్జల కు సమాజంలో తిరిగే హక్కులేదు’ అని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మండిపడ్డారు. మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ‘చేయకూడని తప్పులు చేస్తున్నారు.

మహిళలను సంకర జాతి అంటారా?: మంత్రి సంధ్యారాణి
అమరావతి, విజయనగరం, జూన్ 10(ఆంధ్రజ్యోతి): ‘మహిళలను సంకర జాతి అంటారా? ఇంత నీచులా? మనుషులా? మృగాలా..! సజ్జల కు సమాజంలో తిరిగే హక్కులేదు’ అని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మండిపడ్డారు. మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ‘చేయకూడని తప్పులు చేస్తున్నారు. కాలగర్భంలో కలిసిపోతారు. మహిళల విషయంలో జగన్రెడ్డి, సజ్జల, కొమ్మినేని తీరు అసహ్యంగా ఉంది. వైసీపీని, సాక్షి చానల్ను మూసేసే సమయం దగ్గర పడింది. సజ్జల రామకృష్ణారెడ్డి సంకర జాతి అని వ్యాఖ్యానించడం మరింత దురదృష్టకరం. జగన్, సజ్జల, సాక్షి బేషరతుగా క్షమాపణలు చెప్పాలి’ అని మంత్రి డిమాండ్ చేశారు.
రాజధానిపై విషం కక్కుతున్నారు: మంత్రి కొండపల్లి
రాజధాని అమరావతిపై జగన్ తన మీడియాతో విషం కక్కిస్తున్నారని, దీన్ని రాష్ట్ర ప్రజలంతా ముక్తకంఠంతో ఖండిస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. సాక్షి డిబేట్లో అమరావతిపై చేసిన వ్యాఖ్యలను వైఎస్ జగన్, భారతిరెడ్డి ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. మంగళవారం విజయనగరంలో మాట్లాడుతూ... ఆ రోజున సాక్షిలో వచ్చిన డిబేట్ను పరిశీలిస్తే వైసీపీ నాయకుల ప్రోద్భలంతోనే కృష్ణంరాజు ఆ వాఖ్యలు చేశారన్నారు. కొమ్మినేని కూడా వాటిని ఖండించకపోవడం ఏంటని ప్రశ్నించారు.