స్వచ్ఛందంగా రక్తదానం చేయండి: గవర్నర్
ABN , Publish Date - Jun 14 , 2025 | 05:19 AM
ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ విజ్ఞప్తి చేశారు.

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ విజ్ఞప్తి చేశారు. శనివారం ప్రపంచ రక్తదాతల దినోత్సవం 2025ను ‘రక్తాన్ని ఇవ్వండి. ఆశను ఇవ్వండి. కలిసి మనం ప్రాణాలను కాపాడుదాం’ అనే ఇతివృత్తంలో జరుపుకుంటున్నట్లు వివరించారు. రాష్ట్రంలో విద్యార్థులు, యువత అందరూ ఏపీ రెడ్క్రాస్ మొబైల్ యాప్ ద్వారా రక్తదాతలుగా నమోదు చేసుకోవాలని, స్వచ్ఛంద రక్తదానికి ముందుకు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 20 రెడ్క్రాస్ రక్త కేంద్రాల్లో రక్తదానం చేయాలని కోరారు.