భక్తవత్సల గోవింద..
ABN , Publish Date - Jun 15 , 2025 | 12:56 AM
వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి శనివారం భక్తజనం పోటెత్తారు.

ఆత్రేయపురం, జూన్ 14(ఆంధ్రజ్యోతి): వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి శనివారం భక్తజనం పోటెత్తారు. వేకుమజామునే స్వామివారికి సుప్రభాతసేవ, నీరాజన మంత్రపుష్పం, ఐశ్వర్యలక్ష్మి హోమం, బాలభోగం తదితర కార్యక్రమాలను శాస్రోక్తంగా నిర్వహించి స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. వివిధ రాష్ర్టాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి తీరువీధుల్లో ఏడు ప్రదక్షి ణలు నిర్వహించుకుని మొక్కులు చెల్లించారు. పలువురు భక్తులు తులభారాలు, కానుకలు సమర్పించుకుని అన్నప్రసాదంలో పాల్గొన్నారు. రాత్రి జరిగిన వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు. వివిధ సేవల ద్వారా స్వామివారి ఒక్కరోజు ఆదాయం రూ.67.43 లక్షలు వచ్చినట్టు ఉప కమిషనరు నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు.