పట్టుపట్టారు!
ABN , Publish Date - Jun 15 , 2025 | 12:51 AM
ఉప్పాడ అంటే చేనేత..రంగురంగుల చీరలు.. మోడళ్లు.. వీటిపై మనసుపారేసుకోని మహిళ లంటూ ఉండరు.. ఎక్కడో హైదరాబాద్, విశాఖ నుంచి ఎందరో ప్రముఖులు ఇక్కడకు వచ్చి చీరలు కొనుగోలు చేస్తారు.

ఇన్నేళ్లకు మంచి రోజులు
15 చోట్ల చేనేత క్లస్టర్లు
రూ.15 కోట్లతో ప్రతిపాదనలు
త్వరలో నిధులు విడుదల
ప్రాజెక్టుపై పవన్ సంప్రదింపులు
నేతన్నలకు ఆధునిక శిక్షణ
మారనున్న పిఠాపురం చిత్రం
(కాకినాడ-ఆంధ్రజ్యోతి)
ఉప్పాడ అంటే చేనేత..రంగురంగుల చీరలు.. మోడళ్లు.. వీటిపై మనసుపారేసుకోని మహిళ లంటూ ఉండరు.. ఎక్కడో హైదరాబాద్, విశాఖ నుంచి ఎందరో ప్రముఖులు ఇక్కడకు వచ్చి చీరలు కొనుగోలు చేస్తారు. సినీ సెలబ్రిటీలు సైతం తమ ఇళ్లల్లో వివాహాలు, ఇతర శుభ కార్యాలకు ఇక్కడి నుంచే చీరలు తీసుకెళతారు. ఏటా రూ.30 కోట్ల వరకు జరిగే ఈ వ్యాపా రానికి ప్రోత్సాహం అందిస్తే చేనేత వ్యాపారం ఎదిగే అవకాశం ఉంది. అటు చేనేత కార్మి కులకు సైతం మేలు జరగనుంది. ఈ నేపథ్యం లో ఉప్పాడ చేనేతకు మరింత చేయూత నం దించి ఆధునిక డిజైన్లలో చీరలు తయారు చేసే లా ప్రభుత్వం తోడ్పాటు అందించబోతోంది. ఈ మేరకు రూ.15 కోట్లతో చేనేత అభివృద్ధి క్లస్టర్ ఏర్పాటుకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. తన సొంత నియోజకవర్గం కావడంతో పవన్ సైతం కేంద్రంతో మాట్లా డుతున్నారు. త్వరలో నిధులు విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు చేనే త శాఖ అధికారులు చెబుతున్నారు.
1600 కుటుంబాలకు ఆధారం
ఉప్పాడ అంటే చేనేత చీరలకు ప్రసిద్ధి. చెన్నై నుంచి మేలురకం నూలు తీసుకు వచ్చి ఇక్కడ మగ్గాలపై నేత కార్మికులు రక రకాల చీరలు నే స్తారు.ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మంచి పే రుంది. ఉప్పాడ, పిఠాపురం, గొల్లప్రోలులో దా దాపు 1600 చేనేత కుటుంబాలు ఉండగా వీరిలో అనేక మంది పట్టు, జాంధానీ చీరలను మగ్గాలపై నేస్తారు. ఉప్పాడలో రెండు చేనేత సంఘాలు వీటిని తయా రుచేసి విక్రయిస్తాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొత్తగా చేనేత ప్రో త్సాహానికి పథకం ప్రారంభించింది. నీడ్ బేస్డ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ ప్రాజెక్టు కింద ఉప్పాడ చేనేత క్లస్టర్ ప్రాజెక్టును ప్రతిపాదించాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించింది. అటు పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ అయినందున ఇక్కడ చేనేతను మరింత ప్రోత్సహించాలని పట్టుదలగా ఉన్నా రు. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ప్రత్యేక ఆసక్తి కనబర్చి కేంద్రానికి ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలు పంపాలని నిర్ణయిం చారు.ఈ మేరకు ఉప్పాడలో 916 మంది ఇళ్లకు నేరుగా వెళ్లి ఇటీవల చేనేతశాఖ అధికారులు అభిప్రాయాలు సేకరించారు. మొత్తం రూ.15 కోట్ల ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం వాటాగా రూ.11.85 కోట్లు ఇవ్వనుంది. మిగిలిన రూ.3.15 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. ఇటీవల రాష్ట్ర చేనేత కమిషనర్ రేఖారాణి ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలను కేంద్ర చేనేత శాఖకు పంపిం చారు. ఈ ప్రాజెక్టుపై పవన్ సైతం కేంద్రంతో మాట్లాడుతున్నారు. త్వరలో నిధులు విడుదల కానున్నాయని కాకినాడ కలెక్టర్ వివరించారు.
ఇలా చేస్తారు..
ప్రాజెక్టు అభివృద్ధి కింద పిఠాపురం నియో జకవర్గంలో 15 చోట్ల చేనేతను ప్రోత్సహించ డానికి పలు అంశాలు ప్రతిపాదించారు. ఉప్పాడలో రూ.1.40 కోట్లతో పనులు చేయబో తున్నారు. రూ.80 లక్షలతో క్వాలిటీ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. రూ.60 లక్ష లతో మెగా షోరూం ఏర్పాటు చేసి చీరలు విక్రయిస్తారు. యు.కొత్తపల్లిలో రూ.కోటితో డిజై న్ స్టూడియో నిర్మిస్తారు. రూ.80 లక్షలతో చీర లు, జాకెట్లు, ఇతర వస్త్రాలు కుట్టేలా యూనిట్ నిర్మించనున్నారు.తాటిపర్తిలో రూ.55 లక్షలతో శారీ స్ర్కీన్ పెయింటింగ్ సెంటర్ నిర్మించను న్నారు. రూ.50 లక్షలతో షోరూం నిర్మిస్తారు. రూ.60 లక్షలతో షాప్ అండ్ షాప్ కింద పాడుబడ్డ చేనేత సంఘం భవనాలు ఆధుని కీకరిస్తారు. చేబ్రోలులో నూలుకు రంగులు అద్దే యూనిట్ రూ.2.50 కోట్లతో ఏర్పాటు చేయనున్నారు. రూ.50 లక్షలతో షోరూం కట్ట నున్నారు. దుర్గాడలో రూ.80 లక్షలతో గార్మెంట్ మేకింగ్ యూనిట్ స్థాపించాలని ప్రతిపాదిం చారు. చెందుర్తిలో రూ.55 లక్షలతో శారీ స్ర్కీన్ ప్రింటింగ్ను అందుబాటులోకి తెస్తున్నారు. గొల్లప్రోలులో రూ.50 లక్షలతో హోం ఫర్నీషింగ్ యూనిట్ స్థాపించనున్నారు. మొత్తం రూ.12 కోట్లతో చేనేతకు సంబంధించి ఆధునిక మోడ ళ్లలో చీరలు, జాకెట్లు డిజైన్ చేయడం, రక రకాల స్ర్కీన్ ప్రింటింగ్లు అందుబాటులోకి తేనున్నారు. రూ.1.50 కోట్లతో ఇంటిగ్రేటెడ్ శిక్ష ణ కేంద్రం ఏర్పాటు చేసి జిల్లాలో చేనేత కార్మి కులు, మహిళలకు ఆధునిక మోడళ్లపై శిక్షణ ఇస్తారు. దేశంలో ప్రముఖ నేషనల్ ఇన్ట్సి ట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (ఎన్ఐఎఫ్ టీ)ల నుంచి ప్రముఖ డిజైనర్లను ఉప్పాడ తీసుకు వస్తారు. నిపుణులతో రెండేళ్లపాటు శిక్షణ ఇప్పించనున్నారు. ఇందుకు రూ.3 కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా వేశారు.