పాములేరు వాగులో ఇద్దరు యువకుల గల్లంతు
ABN , Publish Date - Jun 15 , 2025 | 12:28 AM
మారేడుమిల్లి, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): పర్యాటక ప్రాంతమైన అల్లూరి సీతరామరాజు జిల్లా మారేడుమిల్లి పాములేరు వాగులో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. శనివారం విజయవాడ నుంచి 10 మంది స్నేహితులు మారేడుమిల్లి పర్యాటకానికి వచ్చారు. పాములేరు వాగు లో డి.సాలీస్ (23), కటకం రవితేజ (30), మ

మారేడుమిల్లి, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): పర్యాటక ప్రాంతమైన అల్లూరి సీతరామరాజు జిల్లా మారేడుమిల్లి పాములేరు వాగులో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. శనివారం విజయవాడ నుంచి 10 మంది స్నేహితులు మారేడుమిల్లి పర్యాటకానికి వచ్చారు. పాములేరు వాగు లో డి.సాలీస్ (23), కటకం రవితేజ (30), మరో ఇద్దరు యువకులు స్నానానికి దిగారు. వాగులో వారు గల్లంతవుతుండగా తోటి స్నేహితులు రక్షి ంచే ప్రయత్నం చేశారు. ఇద్దరు ప్రా ణాలతో బ యటపడగా సాలీస్, రవితేజ గల్లంతయ్యారు. దీంతో మిగిలిన స్నేహితులు స్థానిక పోలీసులకు సమా చారం అందించారు. సీఐ గోపాలకృష్ణ ఆధ్వర్యం లో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు శనివారం రాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ గల్లం తైన ఇద్దరు యువకుల ఆచూకీ లభించలేదు.