శనేశ్వరస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు
ABN , Publish Date - Jun 15 , 2025 | 12:52 AM
మందపల్లి శనేశ్వరస్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు.

కొత్తపేట, జూన్ 14(ఆంధ్రజ్యోతి): మందపల్లి శనేశ్వరస్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే స్వామివారి సర్వ దర్శనాలు, తైలాభిషేకాలకు భక్తజనం బారులుతీరారు. ఆలయ ప్రాంగణం లో పలువురు భక్తులు ప్రత్యేక పూజలు జరి పారు. వివిధ సేవల ద్వారా స్వామివారికి రూ.2,05,111 ఒక్కరోజు ఆదాయం వచ్చినట్లు ఆలయ సహాయ కమిషనరు నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు.