యోగాతో ఆరోగ్యం
ABN , Publish Date - Jun 15 , 2025 | 12:40 AM
శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా దోహదపడుతుందని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ అన్నారు. యోగాంధ్ర-2025 కార్యక్రమంలో భాగంగా నన్నయ వర్శిటీలోని ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్ భవనంలో శనివారం బోధన, బోధనేతర సిబ్బందికి యోగాగురువు ఎన్.శివశంకర్ ప్రాణాయామం, యోగాసనాలను సాధన చేయించారు.

18న నన్నయలో మెగా యోగాంధ్ర
ఉపకులపతి ఆచార్య ప్రసన్నశ్రీ
పలుచోట్ల యోగాసనాల సాధన
దివాన్చెరువు, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా దోహదపడుతుందని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ అన్నారు. యోగాంధ్ర-2025 కార్యక్రమంలో భాగంగా నన్నయ వర్శిటీలోని ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్ భవనంలో శనివారం బోధన, బోధనేతర సిబ్బందికి యోగాగురువు ఎన్.శివశంకర్ ప్రాణాయామం, యోగాసనాలను సాధన చేయించారు. కార్యక్రమానికి విచ్చేసిన వీసీ మాట్లాడుతూ వన్ఎర్త్- వన్ హెల్త్ నినాదంతో అందరూ యోగసాధన చేయాలన్నారు. యూనివర్శిటీ స్థాయిలో ఈ నెల 18న మెగా యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. విశ్వవిద్యాలయ ప్రాంగణంతో బాటు అనుబంధ కళాశాలలు ఇందులో భాగస్వామ్యమై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. వర్శిటీ అధికారులు,అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ పీవోలు, కళాశాలల యాజమాన్యాలు యోగాంధ్ర కార్యక్రమంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య జి.సుధాకర్, వర్శిటీ అధికారులు పాల్గొన్నారు.