దోపిడీకి బయలుదేరి.. గంజాయితో పట్టుబడి...
ABN , Publish Date - Jun 15 , 2025 | 12:30 AM
కొవ్వూరు, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): గంజాయి తో ఏడుగురిని అరెస్టు చేసినట్టు కొవ్వూరు డీ ఎస్పీ జి.దేవకుమార్ తెలిపారు. కొంతమంది వ్య క్తులు కారులో గంజాయి తరలిస్తున్నారని సమాచారం రావడంతో తూర్పు గోదావరి జిల్లా కొవ్వూ రు రోడ్ కం రైలు బ్రిడ్జి వద్ద కొవ్వూరు పట్టణ సీఐ పి.విశ్వం, తాళ్లపూడి ఎస్ఐ టి.రామకృష్ణ శనివారం వాహన తనిఖీలు చేపట్టారు. కారులో అ నుమానస్పదంగా సంచరిస్తున్న ఏడుగురిని అరె స్టు చేశారు. వారి నుంచి 26 కిలోల గంజాయి, బాలినో కా

కొవ్వూరులో ఏడుగురి అరెస్ట్
కారు, కత్తులు, సెల్ఫోన్లు స్వాధీనం
కొవ్వూరు, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): గంజాయి తో ఏడుగురిని అరెస్టు చేసినట్టు కొవ్వూరు డీ ఎస్పీ జి.దేవకుమార్ తెలిపారు. కొంతమంది వ్య క్తులు కారులో గంజాయి తరలిస్తున్నారని సమాచారం రావడంతో తూర్పు గోదావరి జిల్లా కొవ్వూ రు రోడ్ కం రైలు బ్రిడ్జి వద్ద కొవ్వూరు పట్టణ సీఐ పి.విశ్వం, తాళ్లపూడి ఎస్ఐ టి.రామకృష్ణ శనివారం వాహన తనిఖీలు చేపట్టారు. కారులో అ నుమానస్పదంగా సంచరిస్తున్న ఏడుగురిని అరె స్టు చేశారు. వారి నుంచి 26 కిలోల గంజాయి, బాలినో కారు, 2 కత్తులు, ఇనుపరాడ్డు, 5 సెల్ ఫోన్లు, రూ.1130 నగదు స్వాధీనం చేసుకున్నారు. వారిని విచారించి వివరాలు తెలుసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరుకి చెందిన సాకావంశీ, తణుకు పొటికుచ్చివారి వీధికి చెందిన ఇజ్ఞాడ పాపినాయుడు, పెరవలి మండలం అజ్జరం గ్రామానికి చెందిన మర్రి సామేలు, పాలంగి సుబ్బరాజు, కాండ్రేగుల గురుప్రసాద్, పెరవలికి చెందిన చినిమిల్లి శివకృష్ణ, సవరపు ప్రవీణ్ కలిసి ఒక ప్రైవేటు ట్రావెల్స్ నుంచి బాలినో కారును అద్దెకు తీసుకుని దో పిడీ చేయడానికి నిర్ణయించుకుని బయలుదేరారు. దొంగతనం చేయడానికి ఇనుపరాడ్డు, పెద్ద కత్తి, చిన్న కత్తిని కారులో పెట్టుకుని శ్రీకాకుళం జిల్లా చిలకపాలెంలో బంగారపు షాపులో దొంగతనం చేయడానికి సన్నాహం చేసుకున్నారు. ము ందుగా రెక్కీ నిర్వహించి అక్కడ నుంచి వస్తూ అల్లూరి సీతారామరాజు జిల్లా దారవరంలో 26 కిలోల గంజాయిని తీసుకుని కారులో పెట్టుకుని పెరవలి వస్తున్నారు. కొవ్వూరు రోడ్డు కం రైలు బ్రిడ్జి టోలిగేటుసెంటర్లో శనివారం మధ్యాహ్నం వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు కారు ను నిలుపుదలచేసి అనుమానస్పదంగా కనిపించిన ఏడుగురిని విచారించి అరెస్టు చేశారు. ఏడు గురిని రిమాండ్ నిమిత్తం కోర్టుకు పం పించామన్నారు. కేసులో ప్రతిభ కనబర్చిన సీఐ విశ్వం, ఎస్ఐ రామకృష్ణ, సిబ్బందిని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ అభినందించారు.