Share News

నాన్నకు ప్రేమతో..

ABN , Publish Date - Jun 15 , 2025 | 12:26 AM

ఒకప్పుడు నాన్నలు కఠినంగా ఉండేవారు. తమ పిల్లలకు విలన్లుగా కనిపించేవారు. కేవలం చదువుకు మాత్రమే విలువ ఇచ్చేవారు. ఏదైనా కొనమంటే పదేపదే ఆలోచించేవారు. ఇప్పుడు వద్దు అని కరాఖండీగా చెప్పేవారు. చదువుకొంటేనే మంచి భవిష్యత్తు అని వారి స్టైల్లో చెప్పేవారు. అయితే వారి మాటలు చెవికెక్కించుకున్న పిల్లలు నేడు మంచి ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. అప్పట్లో పిల్లలు కూడా నాన్నను ఏదైనా అడగాలంటే భయపడేవారు. అమ్మ ద్వారానే నాన్న

నాన్నకు ప్రేమతో..

ఒకప్పుడు నాన్నలు కఠినంగా ఉండేవారు. తమ పిల్లలకు విలన్లుగా కనిపించేవారు. కేవలం చదువుకు మాత్రమే విలువ ఇచ్చేవారు. ఏదైనా కొనమంటే పదేపదే ఆలోచించేవారు. ఇప్పుడు వద్దు అని కరాఖండీగా చెప్పేవారు. చదువుకొంటేనే మంచి భవిష్యత్తు అని వారి స్టైల్లో చెప్పేవారు. అయితే వారి మాటలు చెవికెక్కించుకున్న పిల్లలు నేడు మంచి ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. అప్పట్లో పిల్లలు కూడా నాన్నను ఏదైనా అడగాలంటే భయపడేవారు. అమ్మ ద్వారానే నాన్నకు విషయం వెళ్లేది.. కానీ నేడు... నాన్నలు పిల్లలకు హీరోలుగా మారారు. చాలా మంది వారిని స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. ఇక నాన్నలు కూడా వారి పిల్లలను గారాబంగా పెంచుతున్నారు. వారు అడిగింది ఏదీ కాదనకుండా కొనిచ్చేస్తున్నారు. నాన్న, పిల్లల మధ్య బంధం ఫ్రెండ్స్‌లా మారిపోయింది. ఏ విషయాన్నైనా నాన్నతో ఈజీగా పంచుకునే రోజులు వచ్చేశాయి. ఆఖరికి తాను ఫలానా అమ్మాయిని ప్రేమిస్తున్నాను అనే మాటను కూడా నేడు పిల్లలు సులువుగా నాన్నకు చెప్పేస్తున్నారంటే.. నాన్న మారిపోయాడని అర్థమవుతోంది.

- రాజమహేంద్రవరం, కాకినాడ, అనపర్తి, ఉప్పలగుప్తం/ఆంధ్రజ్యోతి

నాన్న ఎందుకో వెనుకబడ్డాడు..

బిడ్డలపై చూపించే ప్రేమలో తల్లిదండ్రుల పాత్రలు సమానం. కుటుంబం గురించి ఆలోచించే క్రమంలో, అవసరాలను తీర్చే దారిలో అమ్మానాన్నా సమానమే అయినా నాన్న కాస్త ఎక్కువగా టెన్షన్‌ పడుతూ ఉంటాడు. సాధారణంగా ఏ ఇంట్లో అయినా చూస్తే.. అందరికంటే తక్కువ బట్టలు, చెప్పుల జతలు నాన్నకే ఉంటాయి. వాటి గురించి కూడా పెద్దగా పట్టించుకోడు. కానీ పిల్లల మనసులో మాత్రం నాన్న ఎప్పుడూ కాస్త వెనుకబడుతూనే ఉంటాడు. ఎందుకంటే.. అమ్మ తిడిడే లాలనగా ఉంటుంది.. నాన్న కోప్పడితే ఆక్రోషంలా కనిపిస్తుంది. నిజానికి నాన్న కోపాన్ని పిల్లల భవిష్యత్తు ప్రతి క్షణం శాసిస్తూ ఉంటుంది. అందుకే బయటకు కఠినంగా ఉంటూ లోపల వెన్నపూసలా కరిగిపోతూ ఉంటారు. చాలా మంది పిల్లలు తల్లికి ఇచ్చినంత ప్రాధాన్యం తండ్రికి ఇవ్వరని సర్వేలు చెబుతున్న వాస్తవం. అయితే జీవిత కథలు చూసుకుంటే నాన్న నుంచి నేర్చుకున్న వాళ్లే ఎక్కువగా ఉంటారు. అది మంచి అయినా.. చెడు అయినా. కుటుంబానికి ఎంత చేసినా అధిక శాతం తండ్రులు పిల్లల దృష్టిలో చులకనే. దీనివల్ల లోలోపల కుమిలిపోయే తండ్రులు ఎంతో మంది ఉన్నారు. కాస్త ఎదిగిన పిల్లలు నీకెందుకు నేనున్నాగా అని నాన్నతో ఒక్క మాట అంటే మౌనంగా ఎంతో మురిసిపోతారు. ఆ మాటను వంద మందికి చెప్పుకొని గంతులు వేస్తారు. అందుకనే నాన్నను అర్థం చేసుకుంటే జీవితాన్ని ఔపోసన పట్టినట్టే. ఇక అంతర్జాతీయ పితృ దినోత్సవాన్ని ప్రతి ఏడాది జూన్‌ నెలలోని మూడో ఆదివారం జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 60 దేశాల్లో తండ్రుల గౌరవార్థం ఈ వేడుక నిర్వహిస్తున్నారు. మాతృ దినోత్సవం మాదిరిగానే పితృ దినోత్సవం ఉండాలనే తలంపుతో అమెరికాకు చెందిన సొనోరా అనే మహిళ పితృ దినోత్సవంపై ప్రచారం మొదలుపెట్టారు. దీంతో 1910లో మొదటిసారిగా ఫాదర్స్‌ డేని నిర్వహించారు.

మా నాన్నే హీరో

నాన్న పీఎంపీ.. పిల్లలు డాక్టర్లు

నా తండ్రి షేక్‌ చినవలియా. మాది ఉప్పలగు ప్తం మండలం గొల్లవిల్లి. నిరుపేద కుటుంబం. ఆయన తన తండ్రికి సహాయపడాలన్న ఆలోచనతో ఒక ఆసుపత్రిలో సహాయకుడిగా చేరారు. తర్వాత స్వగ్రామంలో పీఎంపీగా వైద్య సేవలంది స్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. కానీ తన పిల్లలు తనలా సంచికట్టు డాక్టర్లు కాకూడదని, వైద్య వృత్తిలో పట్టభద్రులుగా చూడాలని కలలు గన్నా రు. పిల్లలు వైద్యులుగా పట్టాలు తీసుకుని సమాజంలో గొప్పగా జీవించాలన్నది ఆయన సంకల్పం. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కుంటూనే మమ్మల్ని మెడిసిన్‌ చదివించారు. మేం ముగ్గురం. పెద్ద కుమారుడు అహ్మద్‌ అలీషా దంత వైద్యునిగా క్లినిక్‌ నడుపుతున్నారు. కుమార్తె హసీనా ప్రస్తుతం రావులపాలెం మండలం ఊబలంక పీహెచ్‌సీ వైద్యాధికారిణి. మూడో కుమారుడు అబ్దుర్‌రెహమాన్‌ బెంగళూరులో ఎంబీఏ చదువుతున్నాడు. పీఎంపీగా మా తండ్రి మమ్మల్ని వైద్య పట్టభద్రులుగా చూడాలని ఎన్నో ఆర్థిక ఇబ్బందులను తట్టుకున్నారు. తలకు మించిన భారం ఎందుకని పలువురు సలహాలిచ్చినా పట్టించుకోకుండా మా ఉన్నతి కోసం నిత్యం తపించారు. ఆయన కడుపున పుట్టడం నిజంగా ఎంతో అదృష్టం. ఎప్పటికీ మా నాన్నే మా హీరో.

నాన్న బాటలోనే రాజకీయాల్లోకి..

అనపర్తి శాసనసభ్యుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి

ప్రతి ఒక్కరికి కొన్ని కలలుంటాయి. ఇలా ఎదగాలని, ఇలా స్థిరపడాలని ఉంటుంది. కానీ ఒక్కోసారి కుటుంబ ప్రభావంతో మనం కోరుకున్న దారి మారిపోతుంటుంది. నేను డాక్టర్‌ కావాలనుకున్నా. కానీ ఇంజనీర్‌ అయ్యా. కానీ కుటుంబ వారసత్వ రాజకీయాల ప్రభావంతో రాజకీయ నేతగా మారిపోయా. నా తండ్రి నల్లమిల్లి మూలారెడ్డి 1970 ప్రాంతంలో అనపర్తి మండలం రామవరం గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా ఎన్నికై రాజకీ య ఆరంగ్రేటం చేశారు. తర్వాత తెలుగుదేశం పార్టీ ఆవిర్భా వంతో అన్న ఎన్టీఆర్‌ ఆశయాలకు అనుగుణంగా సమాజ సేవ కు ముందుకు వచ్చి అనపర్తి ఎమ్మెల్యేగా నాలుగు పర్యాయాలు గెలిచి నియోజకవర్గ ప్రజలకు సేవలందించారు. నాకు మాత్రం డాక్టర్‌ కావాలనేది కల. అనుకోనివిధంగా ఇంజనీరింగ్‌ కోర్సు చదివి బీఈ పట్టా పొందా. పారిశ్రామికవేత్తగా పేరు తెచ్చుకోవాలని వంశీ పవర్‌ పేరుతో పవర్‌ప్లాంట్‌ను స్థాపించారు. కానీ ఎన్నికల సమయంలో తండ్రికి చేదోడుగా నిలిచేవాడిని. నా తం డ్రికి నాటికలపై ఉన్న మక్కువతో ఏర్పాటుచేసిన మూలారెడ్డి కళా పరిషత్‌ బాధ్యతలను వేసుకున్నా. తర్వాత నా తండ్రి వారసుడిగా 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించా. తిరిగి 2024 ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీచేసి రెండవ పర్యాయం ఎమ్మెల్యేగా గెలుపొందా. సాధరణంగా ఒక కుటుంబంలో తాను, భార్య బిడ్డలు బావున్నారా అనే చూసుకుంటారు.. కానీ తనను నమ్ముకున్న కుటుంబాలు ఎలా ఉన్నాయి, వారికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని నిత్యం ఆలోచనలతో ముందుకుసాగుతూ వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ ప్రజల అభిమానాన్ని చూరగొన్న మూలారెడ్డికి కొడుకుగా జన్మించడం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నా. ఆయన చూపిన బాటలోనే పయనిస్తున్నా.

మంచి స్నేహితులం..

నాన్న దూసి ధర్మారావు. టీచర్‌, జూనియర్‌ లెక్చరర్‌గా పనిచేశారు. ఆయన చాలా ఫేమస్‌ పర్సనాలిటీ. ఆయన నన్ను ఎప్పుడూ స్నేహితుడి మాదిరిగానే చూశారు. బిగ్‌ రోల్‌ మోడల్‌. ఆయన పూర్తి ప్రభావం నా మీద ఉంది. చిన్నప్పటి నుంచీ ఆయనతో కలిసే తిరిగాను. ఆయన ప్రపం చం చాలా పెద్దది. గవర్నమెంట్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో ఆయన ప్రిన్సి పాల్‌గా చేసే సమయంలో 8, 9, 10 అక్కడే చదువుకున్నాను. మంచి సా మాజిక, సాహిత్య సేవకులు. చరిత్ర సంస్కృతిని కాపాడడంలో గొప్ప కృషి చేశారు. మంచి రచయిత, ప్రీలాన్స్‌ జర్నలిస్ట్‌. ఏ రోజూ నా జీవిత మార్గా న్ని నిర్దేశించలేదు. చాలా స్వేచ్ఛగా ఆలోచనలు చేసుకొనే అవకాశం ఇచ్చా రు. ఆయనకు నెగిటివ్‌ ఆలోచనలు, మాటలు ఎప్పుడూ నచ్చేది కాదు. ‘మంచి ఉద్యోగం చేస్తే చాలు. సొసైటీకి నీ కంట్రిబ్యూషన్‌ ఉంటే చాలు. టీచర్‌, అటెండర్‌ కూడా కంట్రిబ్యూట్‌ చేయవచ్చు. సామాజిక స్పృహ ఉం డాలి. పక్కవాడి మంచి గురించి ఆలోచించాలి. సొసైటీని విమర్శించుకుం టూ బతకొద్దు. అప్పుడు మనల్ని వదిలేసి సమాజం ముందుకు సాగిపో తుంది. సమాజంలో అడ్డంకులను అధిగమించి మనం చేయాలనుకున్నది చేసుకుపోవాలి. పదిమందికి ఉపయోగంగా ఉండాలి’ అని నిరంతరం చెబుతూ ఉండేవారు. ‘ఆయన దినచర్య ఉదయం ఆరు గంటలకు ప్రారం భం అయ్యేది. ఉద్యోగం, సామాజిక సేవలు చూసుకొని రాత్రి 11గంటల సమయంలో ఇంటికి చేరే వారు. సమా జంలోని వివిధ అంశాలు, సేవ వంటి వాటిపై ఇద్దరి మధ్యా తరచు చర్చ నడుస్తుండేది. ఏ రోజూ ఇది చదువని ఆయన చెప్పలేదు. అల్లరి చేస్తున్నా ఏమీ అనేవారు కాదు. ఎవ రికి వారే తమ తప్పు తెలుసుకొని దాని నుంచి బయటకు రావాలి. ఎవరో చెబితే తెలుసుకోవడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. ఈరోజు బతికు న్నామంటే చక్కగా, హ్యాపీగా ఉండాలి. కష్టాన్ని అంగీకరించకూడదు. దానిపై ఫైట్‌ చేయాలి. దుఃఖం వచ్చిందని అక్కడే ఆగిపోకూడదు. దాని నుంచి బయటపడే మార్గం కూడా మన దగ్గరే ఉంటుంది’ అని చెప్పే వారు. ఆయన చాలా పుస్తకాలు రాశారు. రసతరంగిణి, స్టోరీ ఆన్‌స్టోన్‌ వంటి పుస్తకాలు రాశారు. ఆయన నాకు ప్రతి క్షణం గుర్తొస్తూనే ఉంటారు. నేను, సమాజం కూడా ఆయనను మరిపోయే రోజు ఉండదు. దురదృష్టవ శాత్తూ ఆయన 2017లో కాలం చేసినా నాతోనే ఎప్పుడూ ఉంటారు.

- దూసి నరసింహ కిషోర్‌, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ

Updated Date - Jun 15 , 2025 | 12:26 AM