Share News

కేశవస్వామి అన్నదాన ట్రస్టుకు విరాళం

ABN , Publish Date - Jun 15 , 2025 | 12:54 AM

ర్యాలి జగన్మోహిని కేశవస్వామి ఆలయానికి శనివారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల తో కిటకిటలాడింది.

కేశవస్వామి అన్నదాన ట్రస్టుకు విరాళం

ఆత్రేయపురం, జూన్‌ 14(ఆంధ్రజ్యోతి): ర్యాలి జగన్మోహిని కేశవస్వామి ఆలయానికి శనివారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల తో కిటకిటలాడింది. స్వామివారి అన్నదాన ట్రస్టుకు హైదరాబాద్‌కు చెందిన పి.శ్రవణ్‌ కుమార్‌, జయలక్ష్మి దంపతులు రూ.25,166, ర్యాలికి చెందిన తాడి నూకయ్య, నాగలక్ష్మి దం పతులు రూ.10,200, విశాఖకు చెందిన ఎం. యశ్వంత్‌ రూ.5,116, మోపిదేవి కృష్ణమోహన్‌ రూ.5,116, నూజివీడుకు చెందిన లావు ఆనందధనకోటి ప్రసాదరావు రూ.5,116 విరాళాలను సమర్పించారు. ఆలయ ఈవో బీహెచ్‌వీ రమణమూర్తి దాతలకు స్వామివారి చిత్రపటం, శేషవస్త్రం అందించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి అన్న ప్రసాదంలో పాల్గొన్నారు.

Updated Date - Jun 15 , 2025 | 12:54 AM