పూతరేకుల్లో కల్తీనెయ్యి
ABN , Publish Date - Mar 19 , 2025 | 12:16 AM
ఆత్రేయపురం, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): ఆత్రేయపురం పేరు చెప్పగానే పూతరేకులు అని గుర్తుకువస్తుంది. ఇక్కడ తయారుచేస్తున్న పూతరేకులకు ఎంతో పేరు ఉంది. సుమారు ఐదు దశాబ్దాల నుంచి ఆత్రేయపురం పరిసర ప్రాం తాల్లో సుమారు 400 కుటుంబాలు పైనే కూటీర పరిశ్రమలుగా పెట్టుకుని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు. మహిళలు తయారు చేస్తున్న ఈ పూతరేకుల వ్యాపారంతో గ్రామరూపురేఖలే మారిపోయాయి. ఈ వ్యాపారం దినది

ల్యాబ్ పరీక్షల్లో నిర్ధారణ
కల్తీ వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం :
ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్
ఆత్రేయపురం, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): ఆత్రేయపురం పేరు చెప్పగానే పూతరేకులు అని గుర్తుకువస్తుంది. ఇక్కడ తయారుచేస్తున్న పూతరేకులకు ఎంతో పేరు ఉంది. సుమారు ఐదు దశాబ్దాల నుంచి ఆత్రేయపురం పరిసర ప్రాం తాల్లో సుమారు 400 కుటుంబాలు పైనే కూటీర పరిశ్రమలుగా పెట్టుకుని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు. మహిళలు తయారు చేస్తున్న ఈ పూతరేకుల వ్యాపారంతో గ్రామరూపురేఖలే మారిపోయాయి. ఈ వ్యాపారం దినదిన అభివృద్ధి చెందుతూ దేశనలుమూలలతో పాటు ఖంతరాలు దాటిపోయింది. ఇళ్లల్లో జరిగే ఫంక్షన్లకు ఈ స్వీటును రుచి చూపిస్తారు. ఇంత పేరు,ప్రఖ్యాతలు ఉన్న ఈ పూతరేకుల్లో వాడే నెయ్యి విషయంలో కొంతమంది అక్రమార్కులు వ్యాపారం సాగిస్తున్నారు. కల్తీనెయ్యిని వాడుతూ స్వీటు ప్రియుల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారు. కల్తీనెయ్యి అమ్ముతున్న వ్యాపారస్తులకు అధిక ఆదాయం రావడంతో దీన్నే జోరుగా విక్రయిస్తున్నారు. వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి ప్రతిరోజు వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. వివిధ రాష్ర్టాల నుంచి తరలివచ్చే భక్తులు ఈ స్వీట్లను కొనుగోలుచేసుకుని బంధుమిత్రులకు రుచిచూపిస్తుంటారు. ఈ క్రమంలో గత కొంతకాలం నుంచి కొంతమంది వ్యాపారు లు కల్తీనెయ్యి విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు.
ఫుడ్సేఫ్టీ అధికారుల దాడులు
పూతరేకుల్లో కల్తీనెయ్యి వాడుతున్నారనే వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వ ఆదే శాల మేరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల ఫుడ్సేఫ్టీ అధికారుల బృందం ఫిబ్రవరి 17న కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో పూతరేకుల తయారీ షాపులు, కల్తీనెయ్యి అమ్మకాలు సాగిస్తున్న షాపులపై ముమ్మరదాడులు నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి వరకూ విస్తృతం గా తనిఖీలు చేపట్టారు. 160 కిలోల నెయ్యిని కల్తీ నెయ్యిగా అనుమానించి సీజ్ చేసి నమునాలను సేకరరించారు. అలాగే వివిధ దుకాణాల్లో 8 సాంపిల్స్ను సేకరించి సీల్డ్ కవర్లలో భద్రపరిచారు. ఈ నె య్యి సాంపిల్స్ను హైదరాబాద్ ల్యాబ్లకు పంపించారు. అక్కడ ఈ నెయ్యిలో కల్తీ జరిగినట్టు గుర్తించారు. ఫుడ్సేఫ్టీ కంట్రోలర్ శ్రీనివాస్ ల్యాబ్ రిపోర్టులో కల్తీ నెయ్యి వాడుతున్నట్టు నిర్ధారించినట్టుగా గుర్తించారు. కల్తీనెయ్యి అమ్ముతున్న, కొనుగోలు చేసి అమ్మకాలు చేస్తున్న షాపు యజమానులకు నోటీసులు జారీ చేస్తున్నామని తద్వారా వారిపై క్రిమినల్ కేసులు పెడతామని వివరించారు. వ్యాపారులు పూతరేకుల్లో విచ్చలవిడిగా కల్తీనెయ్యి వాడుతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడితే కఠిన చర్యలు చేపడతామని ఆయన హెచ్చరించారు. త్వరలోనే కల్తీనెయ్యి అమ్మకం తయారీషాపులపై దాడులు నిర్వహిస్తామన్నారు. నాణ్యమైన నెయ్యి(బ్రాండ్) వాడాలని లైసెన్సు లేకుండా వ్యాపారాలు చేస్తే చట్టపరమైన చర్య లు తప్పవని స్పష్టం చేశారు.
దెబ్బతిన్న పూతరేకుల ప్రతిష్ట
ఎన్నో ఏళ్ల నుంచి మహిళలు పూతరేకులు తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇంటి దగ్గర తయారుచేస్తున్న నెయ్యి, బ్రాండెడ్ నె య్యిని వాడుతూ వ్యాపారాలను అభివృద్ధి చేసుకుంటూ ఆర్థికంగా నిలతొక్కుకుంటున్నారు. కొంతమంది వ్యాపారులు కల్తీనెయ్యితో పూతరేకులను తయారుచేయడంతో ఆత్రేయపురం పూతరేకుల ప్రతిష్ట దెబ్బతింది. దీంతో కొంతమంది వ్యాపారులు లబోదిబోమంటున్నారు.