Bandi Sanjay: డబుల్ ఇంజన్ సర్కారుతో ఏపీకి డబుల్ ధమాకా
ABN , Publish Date - Jun 12 , 2025 | 04:57 AM
డబుల్ ఇంజన్ సర్కార్తో ఆంధ్రప్రదేశ్కు డబుల్ ధమాకా లభించిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. కేంద్రంలో మోదీ పాలన 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర సంక్షేమ పథకాలను వివరిస్తూ తిరుపతిలో ఏర్పాటు...

ఏ రాష్ట్రానికీ లేనివిధంగా నిధుల వరద : కేంద్ర మంత్రి బండి సంజయ్
తిరుపతి(విద్య), జూన్ 11(ఆంధ్రజ్యోతి): డబుల్ ఇంజన్ సర్కార్తో ఆంధ్రప్రదేశ్కు డబుల్ ధమాకా లభించిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. కేంద్రంలో మోదీ పాలన 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర సంక్షేమ పథకాలను వివరిస్తూ తిరుపతిలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ఏపీకి ఏ రాష్ట్రానికీ లేనంతగా కేంద్రం నిధుల వదర పారించింది. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ప్రత్యేక ఆర్థిక సాయాన్ని మోదీ అందిస్తున్నారు. మోదీ పాలన స్వర్ణయుగం. రైల్వేల అభివృద్ధికి ఏపీకి రికార్డ్ స్థాయిలో నిఽధులు కేటాయించింది. ఎక్కడ టెక్నాలజీ ఉందో అక్కడ అభివృద్ధి ఉంటుంది. ఎక్కడ బీజేపీ ఉంటుందో అక్కడ పేదల సంక్షేమం ఉంటుంది. ఆపరేషన్ సిందూర్తో మన సైనిక సత్తా చాటడంతోపాటు భారతీయులు తలెత్తుకుని నిలబడేలా కేంద్రం వ్యవహరించింది’ అన్నారు.