AP Covid Cases: 8 రాష్ట్రంలో మరో కొవిడ్ కేసులు
ABN , Publish Date - Jun 11 , 2025 | 05:02 AM
కొవిడ్-19 చాపకింద నీరులా విస్తరిస్తోంది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 8 కరోనా కేసులు నమోదయ్యాయి. గుంటూరులో నలుగురికి, ఏలూరులో ఇద్దరికి, అనంతపురం, నెల్లూరుల్లో ఒక్కొక్కరికి పాజిటివ్గా నిర్ధారణ అయింది.

గుంటూరులో నలుగురు, ఏలూరులో ఇద్దరికి పాజిటివ్
అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో ఒక్కో కేసు వెలుగులోకి
(ఆంధ్రజ్యోతి న్యూస్నెట్వర్క్)
కొవిడ్-19 చాపకింద నీరులా విస్తరిస్తోంది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 8 కరోనా కేసులు నమోదయ్యాయి. గుంటూరులో నలుగురికి, ఏలూరులో ఇద్దరికి, అనంతపురం, నెల్లూరుల్లో ఒక్కొక్కరికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. గుంటూరు జిల్లాలో గతవారం రోజుల్లో 37 కేసులు నమోదవగా.. వారిలో నలుగురు గర్భిణులు ఉన్నారు. మంగళవారం గుంటూరు వైద్య కళాశాలలోని స్టేట్ వైరాలజీ ల్యాబ్లో 58 నమూనాలకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా.. నలుగురికి పాజిటివ్ వచ్చింది. ఈ ల్యాబ్లో రోజుకు సగటున 60 నమూనాలను పరీక్షిస్తున్నారు. ఇందులో సింహభాగం జిల్లాలోని ప్రైవేటు వైద్యశాలల నుంచే వస్తున్నాయి. కొవిడ్ లక్షణాలతో ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి వచ్చిన 8మంది శాంపిల్స్ను పరీక్షించగా ఇరువురికి పాజిటివ్ నిర్ధారణ అయింది. ఏలూరులో వేర్వేరు ప్రాంతాలకు చెందిన 53ఏళ్ల పురుషుడు, 28ఏళ్ల మహిళకు కరోనా సోకిందని, ప్రస్తుతం వీరిద్దరూ హోం ఐసోలేషన్లో ఉన్నారని జిల్లా వైద్యాధికారి డాక్టర్ నరేంద్ర కృష్ణ వెల్లడించారు. దీంతో జిల్లాలో యాక్టివ్ కేసుల సంఖ్య 9కి చేరింది. అనంతపురం జిల్లాలో... కడప జిల్లా ప్రొద్దుటూకు చెందిన వృద్ధుడు (75) కొవిడ్ బారిన పడినట్టు జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు తెలిపారు. దీంతో జిల్లాలో కొవిడ్ బాధితుల సంఖ్య ఐదుకు చేరిందన్నారు. కాగా, నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి వైద్య కళాశాల ల్యాబ్లో నిర్వహించిన పరీక్షలో తిరుపతి జిల్లా వెంకటగిరికి చెందిన యువకుడి (21)కి పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారణైంది.