Share News

Penumaka: పేదింటి కల నెరవేరిన వేళ

ABN , Publish Date - Jun 12 , 2025 | 04:47 AM

ఒక పేదింటి కల నెరవేరింది. సీఎం చంద్రబాబు మాటతో నిరుపేద కుటుంబానికి కొత్త ఇల్లు సమకూరింది. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం పెనుమాక గ్రామం సుగాలి కాలనీకి చెందిన పాములు నాయక్‌ కుటుంబం పూరి గుడిసెలో నివసించేది.

Penumaka: పేదింటి కల నెరవేరిన వేళ

  • కొత్త ఇంట్లోకి నిరుపేద కుటుంబం

  • మాట నిలబెట్టుకున్న చంద్రబాబు

తాడేపల్లి, జూన్‌ 11: ఒక పేదింటి కల నెరవేరింది. సీఎం చంద్రబాబు మాటతో నిరుపేద కుటుంబానికి కొత్త ఇల్లు సమకూరింది. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం పెనుమాక గ్రామం సుగాలి కాలనీకి చెందిన పాములు నాయక్‌ కుటుంబం పూరి గుడిసెలో నివసించేది. పెన్షన్‌ పంపిణీ కార్యక్రమంలో భాగంగా గతేడాది జూలై 1న సీఎం చంద్రబాబు వారింటికి వెళ్లారు. ఆ సమయంలో పూరింటిని, వారి స్థితిని చూసి ఆయన చలించారు. తమకు పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఆ కుటుంబం విన్నవించుకుంది. స్పందించిన సీఎం వీలైనంత త్వరలో పక్కా గృహాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరఫున రూ.1.80 లక్షలు మంజూరు చేయించి పనులు మొదలు పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఇంటి నిర్మాణానికి సుమారు రూ.12లక్షలు వ్యయం కాగా మంత్రి లోకేశ్‌, మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి కొల్లి శేషు తమ సొంత నిధులు సమకూర్చారు. కాగా, ఏపీఎంఎ్‌సఐడీసీ చైర్మన్‌ చిల్లపల్లి శ్రీనివాసరావు, కొల్లి శేషు సమక్షంలో పాములు నాయక్‌ కుటుంబం బుధవారం కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసింది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు, లోకేశ్‌, కొల్లి శేషుకు జీవితాంతం రుణపడి ఉంటామని నాయక్‌ కుటుంబీకులు పేర్కొన్నారు.

Updated Date - Jun 12 , 2025 | 04:48 AM