Kakani Govardhan Reddy: మాజీ మంత్రి కాకాణికి బెయిల్ మంజూరు
ABN , Publish Date - Jun 27 , 2025 | 09:51 PM
Kakani Govardhan Reddy: ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డికి బెయిల్ మంజూరైంది. నాల్గవ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.

ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డికి బెయిల్ మంజూరైంది. నాల్గవ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో మిగిలిన నాలుగు కేసుల్లో బెయిల్ కోసం ఆయన తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు.
ఇక, కృష్ణపట్నం సమీపంలో అనధికార టోల్గేట్ ఏర్పాటు చేసి అక్రమ వసూళ్లకి పాల్పడ్డ కేసులో కోర్టు రెండు రోజులపాటు కష్టడీకి అనుమతి ఇచ్చింది. ముత్తుకూరు పోలీసులు ఈ నెల 30వ తేదీ నుంచి రెండు రోజుల పాటు కాకాణిని విచారించనున్నారు.
ఇవి కూడా చదవండి
నువ్వసలు మనిషివేనా.. మూగ జీవిపై అంత దారుణమా..
పాపం వృద్ధులు.. అలా చేయడానికి మనసెలా వచ్చింది..