AP High Court: పీఎస్ఆర్, మధులకు బెయిల్పై 9న నిర్ణయం
ABN , Publish Date - Jun 07 , 2025 | 03:18 AM
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష మూల్యాంకనంలో అక్రమాల కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎ్సఆర్ ఆంజనేయులు, మధుసూదన్ బెయిల్ పిటిషన్లపై శుక్రవారం హైకోర్టులో ఇరువైపుల వాదనలు ముగిశాయి.

పిటిషన్లపై హైకోర్టులో ముగిసిన వాదనలు
గ్రూప్-1 కేసులో దర్యాప్తు కొనసాగుతోంది
బెయిలిస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు
ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ వాదనలు
దర్యాప్తునకు సహకరిస్తారు.. బెయిలివ్వండి
పిటిషనర్ల తరఫున న్యాయవాదుల విజ్ఞప్తి
అమరావతి, జూన్ 6(ఆంధ్రజ్యోతి): ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష మూల్యాంకనంలో అక్రమాల కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎ్సఆర్ ఆంజనేయులు, మధుసూదన్ బెయిల్ పిటిషన్లపై శుక్రవారం హైకోర్టులో ఇరువైపుల వాదనలు ముగిశాయి. ఆ పిటిషన్లపై సోమవారం నిర్ణయం వెల్లడిస్తానని న్యాయస్థానం ప్రకటించింది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మండవ కిరణ్మయి శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఈ కేసులో పీఎ్సఆర్(ఏ1), మధుసూదన్(ఏ2) ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ట్రయల్ కోర్టు బెయిల్ పిటిషన్లు కొట్టివేయడంతో వీరిద్దరూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యం శుక్రవారం విచారణకు రాగా పీఎ్సఆర్ తరఫున న్యాయవాది నగే్షరెడ్డి వాదనలు వినిపిస్తూ.. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే గ్రూప్-1 జవాబు పత్రాల మాన్యువల్ మూల్యాంకనం చేపట్టారన్నారు. క్యామ్సైన్కు చెల్లింపులన్నీ పారదర్శకంగా జరిగాయన్నారు. పిటిషనర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, ఎలాంటి షరతులు విధించినా కట్టుబడి ఉంటారని, బెయిల్ మంజూరు చేయాలని కోరారు. క్యామ్సైన్ మధుసూదన్ తరఫున న్యాయవాది ఉమేశ్ చంద్ర వాదనలు వినిపిస్తూ.. ఏపీపీఎస్సీ అప్పగించిన బాధ్యతను కాంట్రాక్టర్ హోదాలో పిటిషనర్ నిర్వర్తించారు తప్ప నిధులు దుర్వినియోగంతో సంబంధం లేదన్నారు. పోలీసులు నమోదు చేసిన ఐపీసీ సెక్షన్ 409 పిటిషనర్కు వర్తించదన్నారు. దర్యాప్తునకు సహకరిస్తారని, పిటిషనర్ అనారోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకొని బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ప్రాసిక్యూషన్ తరఫున అసిస్టెంట్ పీపీ సాయి రోహిత్ వాదనలు వినిపిస్తూ.. పోలీసుల దర్యాప్తునకు పీఎ్సఆర్ సహకరించడం లేదని, దర్యాప్తు అధికారి ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం లేదని, అధికారులపైనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మూల్యాంకనం విషయంలో పిటిషనర్లు ఇరువురు కుట్రపూరితంగా వ్యవహరించారని చెప్పారు. దర్యాప్తు కొనసాగుతోందని, బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని పేర్కొన్నారు. బెయిల్ పిటిషన్లను కొట్టివేయాలని కోరారు.
మద్యం కేసులో పిటిషన్లపై విచారణ 10కి వాయిదా
మద్యం కుంభకోణంలో నిందితులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సీబీఐ కోర్టు 10వ తేదీకి వాయిదా వేసింది. ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్రెడ్డి బెయిల్ పిటిషన్పై వాదనలకు, బాలాజీ గోవిందప్ప, కె.ధనుంజయ్రెడ్డి, పి.కృష్ణమోహన్రెడ్డి, చాణక్య దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై సిట్కు నోటీసులు జారీ చేయడానికి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. జైల్లో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని చాణక్య శుక్రవారం దాఖలు చేసిన పిటిషన్పై విచారణను కూడా 10కి వాయిదా వేస్తూ న్యాయాధికారి సీతారామకృష్ణారావు ఉత్తర్వులు ఇచ్చారు.