police investigation: యాదవ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్పై దుండగుల దాడి
ABN , Publish Date - Jun 23 , 2025 | 03:46 AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ పెనుబోయిన మహేశ్ యాదవ్పై కొంతమంది దుండగులు దాడికి పాల్పడ్డారు.

పెదవేగి, జూన్ 22(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ పెనుబోయిన మహేశ్ యాదవ్పై కొంతమంది దుండగులు దాడికి పాల్పడ్డారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం రాట్నాలకుంట శ్రీరాట్నాలమ్మ ఆలయం వద్ద ఆదివారం ఓ వేడుకకు హాజరై తిరిగి వెళ్తుండగా రాయన్నపాలెం వద్ద ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై వచ్చి కారును అడ్డగించారు. కారును ధ్వంసం చేసి, కారులోని మహేశ్ యాదవ్తో పాటు టీడీపీ మైనార్టీ సెల్ జిల్లా నాయకుడు షేక్ జహీర్ అహ్మద్, కారు డ్రైవర్ చంద్రసూర్యలపై దాడి చేశారు. తాము మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అనుచరులమంటూ దాడి చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు.