Share News

Nara Lokesh: మీ చొరవ అభినందనీయం.. జాతీయ మహిళా కమిషన్‌పై నారా లోకేష్ ప్రశంస

ABN , Publish Date - Jun 10 , 2025 | 06:31 PM

సాక్షి ఛానల్ డిబేట్‌లో అమరావతి మహిళలను ఉద్దేశించి జర్నలిస్ట్ కృష్ణం రాజు చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అమరావతిని వేశ్యల నగరంగా కృష్ణంరాజు అభివర్ణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో ఆగ్రహ జ్వాలలు రేకెత్తాయి.

Nara Lokesh: మీ చొరవ అభినందనీయం.. జాతీయ మహిళా కమిషన్‌పై నారా లోకేష్ ప్రశంస
Nara Lokesh

అమరావతి: సాక్షి ఛానల్ డిబేట్‌లో అమరావతి మహిళలను ఉద్దేశించి జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అమరావతి (Amaravati)ని వేశ్యల నగరంగా కృష్ణంరాజు అభివర్ణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో ఆగ్రహ జ్వాలలు రేకెత్తాయి. సాక్షి ఛానెల్‌, జర్నలిస్ట్ కృష్ణంరాజుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, కృష్ణంరాజు చేసిన అసభ్యకర వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ (NCWIndia)సుమోటోగా తీసుకుంది.


మహిళా కమిషన్ చొరవను ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) అభినందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. 'అమరావతి మహిళలను ఉద్దేశిస్తూ కృష్ణంరాజు చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై తక్షణమే స్పందించి చర్యలకు ఆదేశించిన జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ విజయ రహత్కర్‌కు అభినందనలు. అమరావతి మహిళా రైతులను వేశ్యలుగా అభివర్ణించడం సిగ్గుచేటు మాత్రమే కాదు.. నేరం కూడా. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సత్వరమే స్పందించి వేగంగా చర్య తీసుకోవడం ద్వారా అలాంటి వ్యాఖ్యలను ఉపేక్షించేది లేదనే బలమైన సందేశం ఇచ్చింది. మేమంతా అమరావతి మహిళా రైతుల వెనుక ఉన్నాం. వారికి సత్వరమే న్యాయం జరగాలని' నారా లోకేష్ ట్వీట్ చేశారు.


కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను మహిళా కమిషన్ ఖండించింది. ఈ వ్యవహారంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేస్తూ మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ విజయ రహత్కర్ రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు. అమరావతి ఉద్యమంలో మహిళా రైతులు కీలకపాత్ర పోషించారని, కృష్ణంరాజు వ్యాఖ్యలపై మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా సుమోటోగా తీసుకుని విచారణకు మహిళా కమిషన్ ఆదేశించింది.


ఇవి కూడా చదవండి

ఎమ్మెల్యే రాజా సింగ్ మళ్లీ హాట్ కామెంట్స్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్

Read latest AP News And Telugu News

Updated Date - Jun 10 , 2025 | 08:38 PM