AP Mega DSC 2025: మెగా డీఎస్సీ పరీక్షలు ప్రారంభం
ABN , Publish Date - Jun 07 , 2025 | 02:39 AM
మెగా డీఎస్సీ-2025 పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో ప్రశాంతంగా పరీక్షలు జరిగాయని డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి తెలిపారు.

మొదటి రోజు 21,892 మంది హాజరు
ఉదయం 88.63%, మధ్యాహ్నం 86.7%
అమరావతి, జూన్ 6(ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీ-2025 పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో ప్రశాంతంగా పరీక్షలు జరిగాయని డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 91 పరీక్షా కేంద్రాల్లో ఉదయం సెషన్లో టీజీటీ- గణితం, టీజీటీ- హిందీ, టీజీటీ- ఫిజిక్స్, టీజీటీ- తెలుగు పరీక్షలకు 16,102 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 14,281 మంది (88.69%) హాజరయ్యారని తెలిపారు. మధ్యాహ్నం సెషన్లో 51 కేంద్రాల్లో టీజీటీ- గణితం పరీక్షకు 8,790 మందికి గాను 7,611 మంది (86.7%) హాజరయ్యారని పేర్కొన్నారు. ఉదయం కడపలో అత్యధికంగా 91.1%, మధ్యాహ్నం నెల్లూరులో అత్యధికంగా 92% మంది పరీక్షలు రాశారని వివరించారు. అన్ని జిల్లా కేంద్రాల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు కన్వీనర్ తెలిపారు.