AP DSC: 20, 21 తేదీల డీఎస్సీ పరీక్షలు మార్పు
ABN , Publish Date - Jun 15 , 2025 | 05:26 AM
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈనెల 20, 21 తేదీల్లో జరగాల్సిన మెగా డీఎస్సీ పరీక్షల తేదీలను మార్చినట్లు కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

అమరావతి, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈనెల 20, 21 తేదీల్లో జరగాల్సిన మెగా డీఎస్సీ పరీక్షల తేదీలను మార్చినట్లు కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రెండు రోజుల్లో పరీక్షలు జరగాల్సిన అభ్యర్థులకు జూలై 1, 2 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తామని, ఈమేరకు హాల్టికెట్లను ఈనెల 25న ఏపీడీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. యోగా దినోత్సవం వల్ల పరీక్షలకు హాజరయ్యే వారుఇబ్బందులకు పడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.