Pawan Kalyan: చెన్నైకు పవన్ కల్యాణ్.. ఘనస్వాగతం పలికిన నేతలు
ABN , Publish Date - May 25 , 2025 | 11:21 PM
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు చెన్నై విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. చెన్నైలో సోమవారం వన్ నేషన్-వన్ ఎలక్షన్ కార్యక్రమంలో పవన్ ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడుకు చెందిన బీజేపీ నేతలు విమానాశ్రయానికి చేరుకుని పవన్కు ఘన స్వాగతం పలికారు.

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan)కు చెన్నై విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. చెన్నై (Chennai)లో సోమవారం వన్ నేషన్-వన్ ఎలక్షన్ కార్యక్రమంలో పవన్ ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడుకు చెందిన బీజేపీ నేతలు విమానాశ్రయానికి చేరుకుని పవన్కు ఘన స్వాగతం పలికారు. పవన్ కల్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు జనసేన జెండాలు పట్టుకుని విమానాశ్రయానికి చేరుకుని సందడి చేశారు.
ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంల సమవేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న పవన్ అట్నుంచి నేరుగా చెన్నై చేరుకున్నారు. పవన్కు స్వాగతం పలికిన వారిలో తమిళనాడు మాజీ గవర్నర్, తమిళనాడు బీజేపీ నాయకురాలు తమిళ సై, ఎం.చక్రవర్తి, అర్జున మూర్తి తదితరులు ఉన్నారు. బస చేయల్సిన హోటల్ వద్దకు చేరుకున్న పవన్కు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నాగేంద్రన్ స్వాగతం పలికారు.
ఈ వార్తలు కూడా చదవండి...
సీఎం చంద్రబాబు కుటుంబం నూతన గృహప్రవేశం
పండుగలా సీఎం చంద్రబాబు గృహప్రవేశం
For More AP News and Telugu News