Annadata Sukhibhava: అర్హులైన రైతులందరికీ అన్నదాత సుఖీభవ
ABN , Publish Date - Jul 30 , 2025 | 04:53 AM
రాష్ట్రంలో ఆగస్టు రెండో తేదీన అర్హులైన రైతులందరికీ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం

తిరస్కరించినవి మళ్లీ పరిశీలించండి
అమరావతి, జూలై 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆగస్టు రెండో తేదీన అర్హులైన రైతులందరికీ అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తెలిపారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన అన్నదాత పథకంపై అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఈ పథకానికి ఇంకా ఈ-కేవైసీ, ఎన్పీపీఐ మ్యాపింగ్ కాని రైతులు వెంటనే రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలన్నారు. ఈకేవైసీ, ఎన్పీపీఐ మ్యాపింగ్ కాని రైతులకు సంక్షిప్త సందేశాలు పంపాలని ఆర్టీజీఎస్ సీఈవోను ఆదేశించారు. పథకానికి అనర్హులుగా గుర్తించిన వారికి ఎందుకు తిరస్కరించామో స్పష్టంగా తెలియ జేయాలన్నారు. తిరస్కరణకు గురైన వారి జాబితాను మరోసారి పరిశీలించి, అర్హత ఉంటే జాబితాలో చేర్చాలన్నారు. ఈ పథకం కింద లబ్ధి పొందాలంటే ఈ-కేవైసీ, ఈ-పంట నమోదు తప్పనిసరి అని వ్యవసాయ శాఖ డైరెక్టర్ డిల్లీరావు చెప్పారు. 155251కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
గుడ్ న్యూస్.. రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏనుగుల గుంపు కదలికలపై వాట్సాప్ ద్వారా హెచ్చరికలు.. పవన్ కల్యాణ్ న్యూ ప్లాన్
Read latest AndhraPradesh News And Telugu News