strike సీహెచఓల నిరవధిక సమ్మె
ABN , Publish Date - Apr 28 , 2025 | 11:06 PM
తమ డిమాండ్లను అంగీకరించాలని వైద్యఆరోగ్యశాఖలో నేషనల్ హెల్త్మిషన కింద విధు లు నిర్వహిస్తున్న సీహెచఓలు సోమవారం నిరవధిక సమ్మెకు శ్రీకా రం చుట్టారు.

పుట్టపర్తిరూరల్, ఏప్రిల్ 28(ఆంధ్రజ్యోతి): తమ డిమాండ్లను అంగీకరించాలని వైద్యఆరోగ్యశాఖలో నేషనల్ హెల్త్మిషన కింద విధు లు నిర్వహిస్తున్న సీహెచఓలు సోమవారం నిరవధిక సమ్మెకు శ్రీకా రం చుట్టారు. మూడు రోజులుగా వీరు పలు విధాలుగా నిరసనలు తెలిపినా.. స్పందన లేకపోవడంతో వారు జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయం ఎదుట నిరవధిక సమ్మె చేపట్టారు. అనంతరం వినతి పత్రాన్ని జిల్లావైద్యఆరోగ్యశాఖ అధికారి ఫైరోజ్బేగంకు అందచేశారు. కార్యక్రమంలో ఏపీఎంసీఏ జిల్లా అధ్యక్షుడు కార్తీక్రెడ్డి, జనరల్ సెక్రటరీ నందీశ్వర్రెడ్డి, చందన, వేణుగోపాల్ పాల్గొన్నారు. ఈ సమ్మెకు ఏపీ ఎన్జీఓ సంఘం నాయకుడు లింగారాంమోహన, ధర్మవరం తాలూకా ప్రెసిడెంట్ శంకర్, ట్రెజరీ అసోసియేషన అధ్యక్షుడు జగదీష్, ఏపీజీఏఈ ఉపాధ్యక్షుడు బాబాఫక్రుద్దీన, సంఘం నాయకులు గఫూర్, దేవేందర్, రమణ, రామాంజినప్ప మద్దతుపలికారు.