old students పూర్వ విద్యార్థుల సమావేశం
ABN , Publish Date - Apr 28 , 2025 | 12:25 AM
స్థానిక జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో 1983- 84లో పదో తరగతి చదివిన విద్యార్థులు దాదాపు 42 సంవత్సరాల తర్వాత అదే పాఠశాలలో ఆదివారం సమావేశమయ్యారు.

ఓబుళదేవరచెరువు, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి): స్థానిక జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో 1983- 84లో పదో తరగతి చదివిన విద్యార్థులు దాదాపు 42 సంవత్సరాల తర్వాత అదే పాఠశాలలో ఆదివారం సమావేశమయ్యారు. నాటి ఉపాధ్యాయులు రామచంద్రారెడ్డి, బాబాఫకృద్దీన, జమాల్ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎస్ఐ మల్లికార్జునరెడ్డి, పూర్వ విద్యార్థులు శ్రీనివాసరాజు, ఉట్ల మహేశ్వర్రెడ్డి, గొర్తిపల్లి మహమూబ్బాషా, నరసింహులు, గిరి, పద్మ, లక్ష్మీనరసమ్మ, టీసీ ఓబులేసు, లక్ష్మీనర్సు, టీచర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.