Share News

Covid Cases: రాష్ట్రంలో మరో మూడు కరోనా కేసులు

ABN , Publish Date - Jun 12 , 2025 | 05:07 AM

రాష్ట్రంలో మరో మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలో బుధవారం రెండు కేసులు వెలుగుచూడగా.. అన్నమయ్య జిల్లాలో ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

Covid Cases: రాష్ట్రంలో మరో మూడు కరోనా కేసులు

నెల్లూరు (వైద్యం), నిమ్మనపల్లి, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మరో మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలో బుధవారం రెండు కేసులు వెలుగుచూడగా.. అన్నమయ్య జిల్లాలో ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నెల్లూరు నగరానికి చెందిన ఇద్దరు యువతులు కరోనా బారినపడినట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది. దీంతో నెల్లూరు జిల్లాలో కొవిడ్‌ కేసుల సంఖ్య 11కు చేరినట్టయింది. అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లి మండలం వెంకోజిగారిపల్లికి చెందిన మహిళకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. రెండు వారాలుగా దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్న ఆమెకు వాల్మీకిపురం ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్‌ రావడంతో స్థానిక వైద్య సిబ్బంది ఆమెను హోం ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

Updated Date - Jun 12 , 2025 | 05:09 AM