Award: ఆ రచయితకు ఉత్తమ జీవిత చరిత్ర పురస్కారం.. ప్రకటించిన నవసాహితీ ఇంటర్నేషనల్
ABN , Publish Date - Dec 04 , 2024 | 12:36 PM
ఇప్పటివరకు నవసాహితీ ఇంటర్నేషనల్ ఉత్తమ కవిత, కథ, నవల, విమర్శ సాహిత్య సేవ, పాత్రికేయ రంగాలలో ప్రముఖులకు ఇస్తున్న అవా ర్థుల పరంపరలో ఉత్తమ జీవిత చరిత్ర పురస్కారాన్ని ప్రవేశపెట్టింది. ఈ విషయాన్ని నవసాహితీ ఇంటర్నేషనల్ (చెన్నై) వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్వీ సూర్యప్రకాశరావు తెలిపారు. సుప్రసిద్ధ సంగీత విద్వన్మణి ఎం ఎస్ సుబ్బు లక్ష్మి జీవిత చరిత్రను ..

ఉత్తమ రచయితలను, కవులను ప్రోత్సహించేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్న చెన్నైకు చెందిన నవసాహితీ ఇంటర్నేషనల్ మరో అడుగు ముందుకువేసింది. ఇప్పటివరకు నవసాహితీ ఇంటర్నేషనల్ ఉత్తమ కవిత, కథ, నవల, విమర్శ సాహిత్య సేవ, పాత్రికేయ రంగాలలో ప్రముఖులకు ఇస్తున్న అవా ర్థుల పరంపరలో ఉత్తమ జీవిత చరిత్ర పురస్కారాన్ని ప్రవేశపెట్టింది. ఈ విషయాన్ని నవసాహితీ ఇంటర్నేషనల్ (చెన్నై) వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్వీ సూర్యప్రకాశరావు తెలిపారు. సుప్రసిద్ధ సంగీత విద్వన్మణి ఎం ఎస్ సుబ్బు లక్ష్మి జీవిత చరిత్రను అద్భుతంగా రాసి ఎందరో ప్రముఖుల మన్ననలు పొందిన గార్లపాటి పల్లవికి మొదటిసారి ఈ పురస్కారాన్ని ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. పల్లవి మహానటి సావిత్రి జీవిత చరిత్రను రాసి వేలాదిమంది ప్రశంసలు పొందారని తెలిపారు. రచయిత పల్లవి స్వస్థలం గుంటూరు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్న ఆమె ప్రాచీన చరిత్రలో మాస్టర్స్ డిగ్రీ పట్టా పొందారు. రచనలు చేసే ప్రవృత్తినే వృత్తిగా ఎంచుకుని ప్రముఖుల జీవిత చరిత్రలను రచించటంలో ప్రత్యేక నైపుణ్యాన్ని, పాఠకాదరణను ఆమె సంపాదించారని నవసాహితీ ఇంటర్నేషనల్ (చెన్నై) వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్వీ సూర్యప్రకాశరావు పేర్కొన్నారు.
త్వరలోనే పూర్తి వివరాలు..
అవార్డు ప్రదానోత్సవానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని సూర్యప్రకాశరావు తెలిపారు. సుస్వరాల లక్ష్మి ఎం ఎస్ సుబ్బలక్ష్మి అనే ఈ పుస్తకాన్ని 2017 లో సత్య సాయి నిగమాగమంలో శాంతా బయోటిక్ వ్యవస్థకులు కె. వరప్రసాద రెడ్డి, అయన సతీమణి వసంత ఆధ్వర్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ పుస్తకం రెండు తెలుగురాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో అత్యంత ప్రాచుర్యం పొందిందని నవసాహితీ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. మూడు ముద్రణలతో దేశ విదేశాలలో వేలమంది సంగీతాభిమానులను ఆకట్టుకుందన్నారు. గార్లపాటి పల్లవి రాసిన మహానటి సావిత్రి జీవిత చరిత్ర 14వేలు, సుస్వరాల సుబ్బలక్ష్మి జీవిత చరిత్ర 5వేల ప్రతులు విక్రయించినట్లు పేర్కొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: రెండు రోజులుగా జలదిగ్భంధంలోనే సిరికొండ...
ఈవార్తను కూడా చదవండి: దారుణం.. ధరణిలో భూమి నమోదు కాలేదని యువరైతు ఆత్మహత్య..
ఈవార్తను కూడా చదవండి: బోధన్లో రెచ్చిపోయిన యువకులు.. మరో వర్గంపై కత్తులతో దాడి..
ఈవార్తను కూడా చదవండి: ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు గ్రీన్ సిగ్నల్
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here