• Home » Ugram Veeram Book

Ugram Veeram Book

యోగ నారసింహుని అనుగ్రహమే పురాణపండ ‘ఉగ్రం వీరం’.. పొన్నాల లక్ష్మయ్య పూర్వ జన్మ సుకృతమే!

యోగ నారసింహుని అనుగ్రహమే పురాణపండ ‘ఉగ్రం వీరం’.. పొన్నాల లక్ష్మయ్య పూర్వ జన్మ సుకృతమే!

యుగాల వెనుక... కాలాల వెనుక దైవ బలమేంటో పదునాలుగు లోకాలకీ సాక్షాత్కరింప చేసిన వీర నృసింహ అవతార వైభవాన్ని అక్షరరూపంలో ‘ఉగ్రం ... వీరం’గా వేలాది మందికి అందించడానికే ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్‌తో ఈ అపురూప గ్రంధాన్ని ఇలా కథాకథన వ్యాఖ్యాన వైఖరీ దక్షతతో కూడిన ప్రహ్లాద నారసింహుల రసవత్తర ఘట్టంగా గ్రంథ రూపంలో అందించే భాగ్యం తనకు కలిగిందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పూర్వ ఐ.టి. శాఖామంత్రి, ప్రస్తుత భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు.

ఉపాసనాబలం వల్లనే పురాణపండకు ‘ఉగ్రం ... వీరం’ సాధ్యం: విఖ్యాత ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు

ఉపాసనాబలం వల్లనే పురాణపండకు ‘ఉగ్రం ... వీరం’ సాధ్యం: విఖ్యాత ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు

పురాణపండ శ్రీనివాస్ భక్తి రసాత్మకంగా అందించిన లక్ష్మీనారసింహుని దివ్య సాన్నిధ్యం ‘ఉగ్రం ... వీరం’ అమోఘ గ్రంధంలో నృసింహావిర్భావ ఘట్టం గాథని చదివితే వొళ్ళు గగుర్పొడుస్తూ ఒక పవిత్ర అనుభూతి కలుగుతుందని....శ్రీనివాస్‌కి, ఆయన రచనా వైభవానికి ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ కటాక్షం పుష్కలంగా ఉందని విఖ్యాత ప్రవచనకర్త, సరస్వతీపుత్రులు చాగంటి కోటేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం పురాణపండ శ్రీనివాస్ రచనాసంకలనం ‘ఉగ్రం ... వీరం’ అపురూప గ్రంధాన్ని విజయవాడ దుర్గమ్మ దేవస్థాన ప్రత్యేక వేదికపై ఆయన ఆవిష్కరించారు

పురాణపండ ‘ఉగ్రం ... వీరం’తో పరవశించిన యాదాద్రి.. ఎన్నో జన్మల పుణ్యమన్న ఈఓ భాస్కరరావు

పురాణపండ ‘ఉగ్రం ... వీరం’తో పరవశించిన యాదాద్రి.. ఎన్నో జన్మల పుణ్యమన్న ఈఓ భాస్కరరావు

గ్రంథ రచయిత , శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ మాట్లాడుతూ.. యాదాద్రి మట్టిని తాకినప్పుడు కలిగే అనుభూతి ఒక ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, అభయాన్నిస్తుందని పేర్కొంటూ ఈ పవిత్ర గ్రంధాన్ని వేల ప్రతుల్లో ప్రచురించి మహా పుణ్య కార్యంగా భుజాలకెత్తుకున్న లక్ష్మయ్య, అరుణాదేవి దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే ఎన్నెన్నో శ్రీవైష్ణవ ఆలయాలకు ‘ఉగ్రం వీరం’ను చేరుస్తున్న ప్రచురణకర్త లక్ష్మయ్య ఆత్మ సమర్పణాభావాన్ని అభినందించారు.

భక్తి మత్తెక్కిన అమోఘ ఘట్టమే పురాణపండ ‘ఉగ్రం ... వీరం’.. కేసీఆర్‌, పొన్నాలపై ప్రశంసలు

భక్తి మత్తెక్కిన అమోఘ ఘట్టమే పురాణపండ ‘ఉగ్రం ... వీరం’.. కేసీఆర్‌, పొన్నాలపై ప్రశంసలు

తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రధాన సాంస్కృతిక, భక్తి కేంద్రాల్లో రచయిత పురాణపండ శ్రీనివాస్ అమోఘ రచనా సంకలనం ‘ఉగ్రం... వీరం’ పవిత్ర గ్రంధాన్ని ఏడుగురు ప్రముఖులచే...

తిరుమల గణపతి గుడిలో... గోశాలల ఒడిలో తన్మయంగా పురాణపండ శ్రీనివాస్

తిరుమల గణపతి గుడిలో... గోశాలల ఒడిలో తన్మయంగా పురాణపండ శ్రీనివాస్

తిరుమల కొండపైకి శ్రీవారి దర్శనానికి వెళ్లే మొట్టమొదటి దారిలో ఉన్న వినాయకుడి గుడి వద్ద మంగళవారం విఘ్నేశ్వరుని దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్ ఆ ఆలయ అర్చక పండితునికి తన ప్రత్యేక పవిత్ర మహాగ్రన్ధమ్ ‘నేనున్నాను’ అందించి మంగళాశీర్వచనం పొందారు. అనంతరం తిరుమల గోశాలనీ దర్శించుకుని... అక్కడి సిబ్బందితో గోవులతో ఉంటే ఉండే ఆరోగ్యం, ఆనందం గురించి మాట్లాడి ఎంతో సంతోషంగా గడిపారు. ఆ తదుపరి శ్రీవారి దర్శనం చేసుకున్న ఆయన శ్రీ రంగనాథమంటపంలో వేదపండితుల ప్రత్యేక ఆశీర్వచనం, శేషవస్త్రం పొందారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి