Home » Ugadi
ప్రతి ఏడాది ఉగాది పంచాంగ శ్రవణంలో నాయకులకు ఎప్పుడూ రాజపూజ్యం. పాపం సామాన్యుడికి మాత్రం 'అవమానం' వాటా ఎప్పుడూ తప్పదు! అంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ భాను ప్రకాశ్ కోగంటి సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తన కుమారుడు దేవాన్ష్తో కలిసి ఉగాది వేడుకలు నిర్వహించుకున్నారు. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా, పండుగ వేళ కుటుంబంతో గడిపిన క్షణాలను ఆయన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న కూటమి ప్రభుత్వానికి ఆ దేవుని ఆశీస్సులు మెండుగా ఉండాలని మంత్రి కొల్లు రవీంద్ర ఆకాంక్షించారు. మచిలీపట్నంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు.
పంచాంగం అంటే ఐదు అంగాలకు సంబంధించిన కాలాన్ని గణన చేసే ఒక అద్భుతమైన వ్యవస్థ అని పీవీఎన్ మాధవ్ అన్నారు. ప్రపంచంలో ఇలాంటిది ఎక్కడా లేదని పేర్కొన్నారు.
జీవితం షడ్రుచుల సమ్మేళనమని కేంద్రమంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. ఐక్యతతోనే సవాళ్లను జయించాలని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో ప్రజలందరికీ మంచి ఆరోగ్యం, ఆనందం కలగాలని ఆకాంక్షించారు.
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతును రాజును చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రవీంద్రభారతిలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో సీఎం పాల్గొన్నారు.
విలువలతో జీవనం గడిపేవారికి ఉన్న ఆనందం ఎవరికీ ఉండదని... విలువలు లేని చోట ఏమీ మిగలదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. విదేశాల్లో తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు అంబాసిడర్లుగా ప్రవాసాంధ్రులు మారారని సీఎం తెలిపారు.
ఉగాది పండుగ రోజున పేదలకు ఆర్థిక సాయం అందించే సీఎంఆర్ఎఫ్ ఫైల్పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేశారు.
శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. తెలుగు సంస్కృతి వినూత్నం, పండుగలు విభిన్నమైనవి అని సీఎం తెలిపారు.