• Home » Tyagaraya Gana Sabha

Tyagaraya Gana Sabha

పురాణపండ అఖండ గ్రంధంతో కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు త్యాగరాయగానసభ మంగళాశాసనం

పురాణపండ అఖండ గ్రంధంతో కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు త్యాగరాయగానసభ మంగళాశాసనం

తెలుగు రాష్ట్రాలలో ప్రతిష్టాత్మక సాంస్కృతిక, సాహిత్య, ఆధ్యాత్మిక కార్యక్రమాల వేదికగా దశాబ్దాల ఖ్యాతిగాంచిన త్యాగరాయ గాన సభ.. కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు అభినందలు తెలియజేస్తూ మహోజ్వలమైన మూడు వందల ముప్పై పేజీల ‘శ్రీ లలిత విష్ణు సహస్రనామ స్తోత్రమ్’ ఇరవై ఐదవ ప్రచురణతో వచ్చేవారం మంగళాశాసనాలు సమర్పిస్తోంది. భారతీయ జనతాపార్టీ మహిళామోర్చా, ఆరెస్సెస్ మహిళా సేవికా సమితిలకు ఈ గ్రంధం వందల సంఖ్యలో పంచనుంది. ఇప్పటికే సుమారు యాభై పై చిలుకుగా అపురూప ధార్మిక గ్రంధాలను కధలుగా, స్తోత్రాలుగా, వ్యాఖ్యానాలుగా తెలుగులోగిళ్ళకు అందించిన జ్ఞాన మహాయజ్ఞ కేంద్రం ప్రచురిస్తున్న ఈ గ్రంధాన్ని తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పూర్వ వైస్ ఛాన్సలర్ ఆచార్య కొలకలూరి ఇనాక్ ప్రోత్సాహంతో గానసభ అధ్యక్షులు జనార్ధనమూర్తి సౌజన్యంతో అందుతోంది. ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారు పురాణపండ శ్రీనివాస్ అందించిన శ్రీవిద్యల రచనా సంకలనమే ‘శ్రీ లలిత విష్ణు సహస్రనామ స్తోత్రమ్’.

సాధకునిగా, కార్య సాధకునిగా మార్చేది స్తోత్ర సాహిత్యమే: పురాణపండ గ్రంథావిష్కరణలో రమణాచారి

సాధకునిగా, కార్య సాధకునిగా మార్చేది స్తోత్ర సాహిత్యమే: పురాణపండ గ్రంథావిష్కరణలో రమణాచారి

ప్రపంచం నుండి పరమాత్మవైపుకు మనస్సును మరల్చడమే దైవీయ చైతన్య గ్రంధాల లక్షణమని, మనిషిని సాధకునిగా, కార్య సాధకునిగా మార్చేది కేవలం స్తోత్ర మంత్ర సాహిత్యం మాత్రమేనని సీనియర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణా ప్రభుత్వ పూర్వ అధికారి కెవి రమణాచారి పేర్కొన్నారు. ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ అపురూప రచనా సంకలనం శ్రీ లలితా విష్ణు సహస్రనామ స్తోత్రమ్ గ్రంధాన్ని శుక్రవారం రాత్రి హైదరాబాద్ త్యాగరాయగానసభలో ఆయన ఆవిష్కరించారు.

పురాణపండ ‘శ్రీ లలిత విష్ణుసహస్రనామస్తోత్రమ్’ ఉచితం: గురుపూర్ణిమ నాడు రమణాచారిచే శ్రీకారం

పురాణపండ ‘శ్రీ లలిత విష్ణుసహస్రనామస్తోత్రమ్’ ఉచితం: గురుపూర్ణిమ నాడు రమణాచారిచే శ్రీకారం

ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ రచనా సంకలనంగా అందిన మూడు వందల పేజీల అమోఘ గ్రంధం ‘శ్రీ లలితా విష్ణు సహస్రనామ స్తోత్రమ్’ గ్రంధాన్ని జంట నగరాల సాహిత్య సాంస్కృతిక ఆధ్యాత్మిక సంస్థలకు, వేద పాఠశాలలకు, అర్చకులకు, వేదపండితులకు ఉచితంగా వితరణ చేయనున్నట్లు ప్రఖ్యాత సాంస్కృతిక కళా వేదిక ‘త్యాగరాయ గాన సభ’ అధ్యక్షులు కళా జనార్ధన మూర్తి పేర్కొన్నారు. గురుపూర్ణిమకు ముందు రోజున ఈ మంగళగ్రంధాన్ని సీనియర్ ఐఏఎస్ అధికారి కె.వి. రమణాచారి ఆవిష్కరిస్తారని ఆయన తెలిపారు.

భక్తి మత్తెక్కిన అమోఘ ఘట్టమే పురాణపండ ‘ఉగ్రం ... వీరం’.. కేసీఆర్‌, పొన్నాలపై ప్రశంసలు

భక్తి మత్తెక్కిన అమోఘ ఘట్టమే పురాణపండ ‘ఉగ్రం ... వీరం’.. కేసీఆర్‌, పొన్నాలపై ప్రశంసలు

తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రధాన సాంస్కృతిక, భక్తి కేంద్రాల్లో రచయిత పురాణపండ శ్రీనివాస్ అమోఘ రచనా సంకలనం ‘ఉగ్రం... వీరం’ పవిత్ర గ్రంధాన్ని ఏడుగురు ప్రముఖులచే...

తాజా వార్తలు

మరిన్ని చదవండి