Home » Saudi Arabia
ప్రధాని మోదీ సౌదీ అరేబియా పర్యటనలో బాపట్ల మహిళ దుర్గాభవానీతో మాట్లాడారు. "మీరు ప్రధాని అయ్యినందుకు సంతోషంగా ఉంది" అన్న ఆమెకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు
భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరగకుండా మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్ధమేనని ఇరాన్ తాజాగా ప్రకటించింది. రెండు దేశాలు తమకు సోదర సమానమైన దేశాలని ఇరాన్ విదేశాంగ మంత్రి పేర్కొన్నారు.
సౌదీ అరేబియాతో చిరకాలంగా ఉన్న మైత్రీ బంధాన్ని సౌదీ పర్యటనకు ముందు ఒక ప్రకటనలో ప్రధానమంత్రి మోదీ గుర్తుచేసుకున్నారు. సౌదీ అరేబియాతో భారత్కు చిరకాల, చారిత్రక సంబంధాలున్నాయని, ఇటీవల కాలంలో ఈ సంబంధాలు మరింత ఊపందుకున్నాయని చెప్పారు.
క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ 2023 సెప్టెంబర్లో ఢిల్లీలో పర్యటించి జి-20 సదస్సు, ఇండియా-సౌదీ అరేబియా స్ట్రాటజిక్ పార్టనర్షిప్ కౌన్సిల్కు కో-చైర్మన్గా వ్యవహరించారని, ఆ సందర్భంలో మోదీని తమ దేశంలో పర్యటించాల్సిందిగా కోరారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ ఏడాది 2025 హజ్ యాత్ర సమయం దగ్గర పడుతోంది. ఈ క్రమంలోనే సౌదీ అరేబియా భారత్ సహా 13 దేశాల వీసాలను తాత్కాలికంగా నిషేధం విధించింది. అయితే ఎందుకు నిషేధం విధించారు, కారణాలేంటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
Sheikh Hidayathulla: గుంటూరు జిల్లా వాసి అరుదైన రికార్డు సాధించారు. సౌదీ అరేబియాలోని నియోంలో వేలాది మంది ఉద్యోగ, కార్మికులతో సురక్షితంగా 30 లక్షల పని గంటలను పూర్తి చేయడం ద్వారా ఒక తెలుగు ప్రవాసీ అరుదైన సెఫ్టీ రికార్డును సాధించారు.
జడ్డాలో జరిగిన ప్రమాద ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడం జైశంకర్ విచారం వ్యక్తం చేశారు. మృతులు, వారి కుటుంబాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్న జెడ్డాలోని కాన్సుల్ జనరల్తో మాట్లాడానని చెప్పారు.
అసలే కూలి బతుకులు. పనులు కూడా సక్రమంగా లేక అప్పుడప్పుడూ ఇంటిల్లిపాదీ పస్తులుండక తప్పేది కాదు. దీంతో భార్యా పిల్లలను సంతోషంగా చూసుకోవాలని అప్పులు చేసి కోటి ఆశలతో ఉపాధి కోసం సౌదీకి వెళ్లాడు.
వీసా నిబంధనల కారణంగా సౌదీలో చిక్కుకుపోయిన ఇద్దరు తెలుగు ప్రవాసీయులు తమ సంతానం కన్నుమూసినా ఇండియాకు రాలేక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.
ఎడారి దేశం సౌదీ అరేబియాలో ప్రతి సంవత్సరం ప్రతిష్ఠాత్మకంగా తెలుగు భాషా దినోత్సవం పేరిట ‘సాటా’ నిర్వహించే తెలుగు ప్రవాసీ ఆత్మీయ సమ్మేళనానికి సన్నాహాలు ఊపందుకున్నాయి.