• Home » Mukesh Kumar Meena

Mukesh Kumar Meena

Election Counting: ఏపీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌‌పై సీఈవో మీనా ఫుల్ క్లారిటీ

Election Counting: ఏపీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌‌పై సీఈవో మీనా ఫుల్ క్లారిటీ

మరికొన్ని గంటల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలవనున్న నేపథ్యంలో ఈ రోజు (సోమవారం) ఆంధప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముకేశ్ కుమాన్ మీనా (Mukesh Kumar Meena) కీలక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదలవుతుందని ప్రకటించారు.

 Mukesh Kumar Meena: ఓట్ల లెక్కింపునకు ముందు, లెక్కింపు రోజు..ఆ తర్వాత శాంతిభద్రతలు పరిరక్షించాలి

Mukesh Kumar Meena: ఓట్ల లెక్కింపునకు ముందు, లెక్కింపు రోజు..ఆ తర్వాత శాంతిభద్రతలు పరిరక్షించాలి

2024 లోక్‌సభ ఎన్నికల(lok sabha election 2024) చివరి ఏడో దశ పోలింగ్ శనివారం ముగిసింది. ఇక ఓట్ల లెక్కింపు ప్రక్రియ జూన్ 4న జరగనుంది. ఈ క్రమంలో అధికారులు దీనికి సంబంధించిన ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా(mukesh kumar meena) లేఖ రాస్తూ అధికారులు, ప్రజలకు కీలక ఆదేశాలను వెలువరించారు.

AP elections: వాటిని సాకుగా చూపి పోస్టల్ బ్యాలెట్ ఇన్‌వ్యాలిడ్ చేయకూడదు: ముకేశ్ కుమార్ మీనా

AP elections: వాటిని సాకుగా చూపి పోస్టల్ బ్యాలెట్ ఇన్‌వ్యాలిడ్ చేయకూడదు: ముకేశ్ కుమార్ మీనా

బ్యాలెట్ పేపర్ వెనక రిటర్నింగ్ అధికారి సంతకమున్నా సీల్ లేదని పోస్టల్ బ్యాలెట్ ఇన్‌వ్యాలిడ్ చేయకూడదంటూ ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. రిటర్నింగ్ అధికారి సంతకానికి, బ్యాలెట్ చెల్లుబాటుకు సంబంధం లేదని సీఈవో స్పష్టం చేశారు. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్‌పైనా గెజిటెడ్ అధికారి సంతకం ఉంటే సీల్ లేదని వాటిని ఇన్‌వ్యాలిడ్‌గా పరిగణించకూడదని పేర్కొన్నారు. ఓటర్ తమ ఓటును బ్యాలెట్ పేపర్‌లో సక్రమంగా వేశారా? లేదా? అని మాత్రమే చూడాలని ఆదేశించారు.

AP Election 2024: వారిపై చర్యలు తీసుకోండి.. సీఈవో మీనాను కలిసిన టీడీపీ నేతలు

AP Election 2024: వారిపై చర్యలు తీసుకోండి.. సీఈవో మీనాను కలిసిన టీడీపీ నేతలు

దౌర్జన్యాలకు పాల్పడిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని, ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నడిపేందుకు చర్యలు చేపట్టాలంటూ సీఈవో ముఖేశ్ కుమార్ మీనాకు టీడీపీ నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఆయనను కలిశారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ... సీఈవో ముఖేశ్ కుమార్ మీనాను కలిసి వైసీపీ దౌర్జన్యాలపై ఫిర్యాదు చేశామని తెలిపారు.

AP Elections 2024: ఏపీలో 81.6 శాతం పోలింగ్: సీఈవో ముఖేశ్ కుమార్ మీనా

AP Elections 2024: ఏపీలో 81.6 శాతం పోలింగ్: సీఈవో ముఖేశ్ కుమార్ మీనా

ఆంధ్రప్రదేశ్‌లో మే 13వ తేదీన జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలపై సీఈవో ముకేష్ కుమార్ మీనా ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నమోదైన పోలింగ్ వివరాలతో పాటు ఆరోజున రాష్ట్రంలో..

AP Elections: ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదు.. ఎంతంటే?

AP Elections: ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదు.. ఎంతంటే?

Andhrapradesh: ఏపీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు పెద్ద ఎత్తున ఓటర్లు తరలిరావడంతో ఈసారి పోలింగ్‌ శాతం భారీగానే నమోదు అయ్యింది. ఈ క్రమంలో ఏపీ పోలింగ్ శాతంపై సీఈవో ముఖేష్‌ కుమార్‌ మీనా కాసేపటి క్రితమే ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదు అయినట్లు సీఈవో తెలిపారు. రాష్ట్రంలో 81.76 శాతం పోలింగ్ నమోదు అయినట్లు వెల్లడించారు.

Ambati Rambabu: పల్నాడు హింసాత్మక ఘటనలపై సీఈవోకు మంత్రి అంబటి ఫిర్యాదు

Ambati Rambabu: పల్నాడు హింసాత్మక ఘటనలపై సీఈవోకు మంత్రి అంబటి ఫిర్యాదు

Andhrapradesh: పల్నాడులో హింసాత్మక ఘటనలపై ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్‌ మీనాకు మంత్రి అంబటి రాంబాబు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పల్నాడులో చాలా చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయన్నారు. గతంలో ఎన్నడూ జరగనంత అధ్వాన్నంగా పల్నాడులో ఎన్నికలు జరిగాయని తెలిపారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని విమర్శించారు.

AP Elections: తొలిసారి ఓటు కోసం రైలుకు ‘గ్రీన్ ఛానల్’

AP Elections: తొలిసారి ఓటు కోసం రైలుకు ‘గ్రీన్ ఛానల్’

Andhrapradesh: ఓట్ల పండగ కోసం ఏపీకి ప్రజలు ఏ విధంగా తరలివచ్చారో అందరికీ తెలిసిందే. రాష్ట్రానికి ఓటర్లు పోటెత్తడంతో పోలింగ్ శాతం కూడా అధికంగా నమోదు అయ్యింది. ఓటు వేసేందుకు ప్రజలు బస్సుల్లో, రైళ్లల్లో సొంత వాహనాల్లో రెండు రోజుల ముందే తమ గ్రామాలకు తరలివచ్చారు. పోలింగ్‌ రోజు ఓటు వేసేందుకు రైలులో వస్తున్న వారి కోసం రైల్వే అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. రైలు కోసం తొలిసారిగా ‘‘గ్రీన్‌ ఛానల్‌’’ను ఏర్పాటు చేశారు.

AP Elections: అలా చేస్తే కఠిన చర్యలు తప్పవు.. సీఈవో మీనా హెచ్చరిక

AP Elections: అలా చేస్తే కఠిన చర్యలు తప్పవు.. సీఈవో మీనా హెచ్చరిక

Andhrapradesh: పోలింగ్‌లో అత్యంత ముఖ్యమైనది సిరా గుర్తు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ఓటర్లకు ఓటు వేసిన అనంతరం పోలింగ్ సిబ్బంది సిరా గుర్తు వేస్తారు. ఎన్నికలలో దొంగ ఓట్లను నిరోధించేందుకు ఈ సిరా ఎంతో ముఖ్యం. సదరు ఓటరు ఓటు వేసినట్లు తెలిసేందుకు, అలాగే ఆ ఓటరు మళ్లీ ఓటు వేయకుండా ఉండేందుకు పోలింగ్ సిబ్బంది సిరా గుర్తును వేస్తుంటారు. అయితే చెరగని సిరా ఇతరులకు అందుబాటులో ఉంటుందంటూ ఇటీవల ఏపీలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

CEO MK Meena: 14న ప్రత్యేక క్యాజువల్ లీవ్

CEO MK Meena: 14న ప్రత్యేక క్యాజువల్ లీవ్

ఈనెల 13న పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి 14న ప్రత్యేక క్యాజువల్ లీవ్(ఆన్ డ్యూటి) ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎంకే మీనా వెల్లడించారు. ఈ మేరకు సంబంధిత లీవ్ శాంక్షనింగ్ అథారిటీలు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. 13న ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఆ మరుసటి రోజు 14న ప్రత్యేక క్యాజువల్ లీవ్(ఆన్ డ్యూటి)గా పరిగణించాలని ఏపీ ఎన్జీవో, ఏపీ జేఏసీ ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేశాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి