• Home » Medaram Jathara

Medaram Jathara

మేడారం అడవుల్లో సుడిగాలుల బీభత్సం

మేడారం అడవుల్లో సుడిగాలుల బీభత్సం

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం అడవుల్లో సుమారు 50 వేల చెట్లు నేలమట్టమయ్యాయి.

Medaram: కంపుకొడుతున్న మేడారం పరిసరాలు.. పట్టించుకోని అధికారులు

Medaram: కంపుకొడుతున్న మేడారం పరిసరాలు.. పట్టించుకోని అధికారులు

Telangana: తెలంగాణ కుంభమేళాగా పిలవడే మేడారం సమక్క-సారలమ్మ మహా జాతర అంగరంగ వైభవంగా జరిగింది. లక్షలాది మంది భక్తులు మేడారంకు విచ్చేసి గద్దెలపై కొలువుదీరిన అమ్మవార్లను దర్శించుకుని... మొక్కలు చెల్లించుకున్నారు. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు నాలుగు రోజుల పాటు మేడారం జాతర జరిగింది. అయితే జాతర ముగిసిన తర్వాత మాత్రం అక్కడి పరిసరాలను చూస్తే ముక్కులు మూసుకోకమానరు.

Medaram 2024: మేడారం హుండీల లెక్కింపు మొదలు

Medaram 2024: మేడారం హుండీల లెక్కింపు మొదలు

Telangana: తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమక్క సారక్క మహా జాతర వైభవంగా ముగిసింది. ఈనెల 21 నుంచి 24 వరకు నాలుగు రోజుల పాటు జరిగిన ఈ జాతరలో లక్షలాది మంది భక్తులు సమక్క - సారలమ్మ దర్శించుకుని తమ మొక్కు తీర్చుకున్నారు. తాజాగా జాతరలో భక్తులు అమ్మవార్లకు వేసిన కానుకల హుండీ లెక్కింపు మొదలైంది. గురువారం హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో మేడారం హుండీలు లెక్కింపు ప్రారంభమైంది.

Medaram: మేడారం హుండీల లెక్కింపు నేడు..

Medaram: మేడారం హుండీల లెక్కింపు నేడు..

వరంగల్: మేడారం హుండీల లెక్కింపు ప్రక్రియ గురువారం హనుమకొండ టీటీడీ కళ్యాణమండపంలో ప్రారంభం కానుంది. మొత్తం 512 హుండీల ఆదాయాన్ని లెక్కించనున్నారు. ఈ లెక్కింపు ప్రక్రియ పది రోజుల పాటు కొనసాగనుంది.

Medaram Jathara: నేడు మేడారం నుంచి హుండీల తరలింపు

Medaram Jathara: నేడు మేడారం నుంచి హుండీల తరలింపు

నేడు మేడారం నుంచి హుండీలను హన్మకొండకు తరలించనున్నారు. హన్మకొండలోని టీటీడీ కల్యాణ మండపానికి తరలించి అక్కడ హుండీ ఆదాయాన్ని దేవాదాయ శాఖ అధికారులు లెక్కించనున్నారు. 29 నుంచి మేడారం హుండీల లెక్కింపు ప్రారంభం కానుంది. మేడారం మహాజాతరలో మొత్తం 512 హుండీలను అధికారులు ఏర్పాటు చేశారు.

Medaram Jatara: ఘనంగా ముగిసిన మేడారం మహాజాతర.. జనం నుంచి వనంలోకి సమ్మక్క..

Medaram Jatara: ఘనంగా ముగిసిన మేడారం మహాజాతర.. జనం నుంచి వనంలోకి సమ్మక్క..

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం జాతర నాలుగు రోజుల పాటు కన్నుల పండువగా సాగి అత్యంత వైభవంగా ముగిసింది. జాతరలో కీలక ఘట్టమైన సమ్మక్క వన ప్రవేశంతో జాతర పరిసమాప్తమైంది.

Medaram Jatara: మేడారంకు గవర్నర్ తమిళిసై.. నిలువెత్తు బంగారం సమర్పణ..

Medaram Jatara: మేడారంకు గవర్నర్ తమిళిసై.. నిలువెత్తు బంగారం సమర్పణ..

Telangana: మేడారం సమక్క - సారమ్మ మహా జాతర వైభవంగా జరుగుతోంది. ఇప్పటికే పెద్దసంఖ్యలో భక్తులు మేడారంకు చేరుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. శుక్రవారం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, కేంద్ర మంత్రి అర్జున్ ముండా మేడారం చేరుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్, కేంద్రమంత్రి నిలువెత్తు బంగారం సమర్పించి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు.

Medaram Jatara: మేడారం జాతరలో పోలీసుల అత్యుత్సాహం.. డ్యూటీలు వదిలి మరీ..

Medaram Jatara: మేడారం జాతరలో పోలీసుల అత్యుత్సాహం.. డ్యూటీలు వదిలి మరీ..

Telangana: మేడారం మహాజాతరలో పోలీసుల ఓవరాక్షన్‌ పట్ల భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేడారం జాతరలో విధులు నిర్వహిస్తున్న డ్యూటీ పోలీసులు వారి కుటుంబాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ భక్తుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి. డ్యూటీలో ఉన్న పోలీసులు ప్రధాన గద్దెలపైకి వారి కుటుంబాలను పంపిస్తున్నారు.

KCR: మేడారం జాతర శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

KCR: మేడారం జాతర శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి చారిత్రక ప్రతీకలుగా, ఇలవేల్పులుగా సబ్బండ వర్గాలచేత పూజలందుకుంటున్న మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర (Medaram Jathara) సందర్భంగా తెలంగాణ తొలిముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు (KCR) శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. రెండేండ్లకోసారి జరిగే మేడారం జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద అడవిబిడ్డల జాతరగా తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిందని అన్నారు.

Medaram Jatara: కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల ఆగ్రహం

Medaram Jatara: కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల ఆగ్రహం

Telangana: మేడారం జాతరను జాతీయ హోదా పండుగగా గుర్తించలేమంటూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఏబీఎన్‌ -ఆంధ్రజ్యోతితో బీఆర్‌ఎస్ నేత సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ... బీజేపీకి గిరిజనులపై ప్రేమలేదన్నారు. బీజేపీ కపటప్రేమ బయటపడిందని మండిపడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి