Home » Lok Sabha
ఎన్నికల సంస్కరణలపై జరిగిన చర్చ సందర్భంగా.. అమిత్ షా ఒత్తిడికి లోనయ్యారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఆయన సరిగ్గా మాట్లాడలేకపోయారని, చేతులు కూడా వణికాయని చెప్పారు రాహుల్.
ఒక వ్యక్తికి ఓటరుగా నమోదు చేసుకునే అర్హత లేకున్నప్పటికీ అతను ఓటరుగా నమోదు చేసుకుంటే అది ఓట్ చోరీ అవుతుందని, అనుచిత విధానాలతో ఎన్నికల్లో గెలిస్తే దానిని ఓట్ చోరీ అంటామని, ప్రజాతీర్పుకు భిన్నంగా ఒక వ్యక్తి అధికారాన్ని హస్తగతం చేసుకుంటే అది కూడా ఓట్ చోరీ అవుతుందని అమిత్షా చెప్పారు.
పార్లమెంటులో చర్చ ఎన్నికల సంస్కరణలకు ఉద్దేశించినప్పటికీ విపక్షాలు కేవలం ఎస్ఐఆర్పైనే దృష్టిసారించాయని, గత నాలుగు నెలలుగా ఎస్ఐఆర్పై అబద్ధాలు చెబుతూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని అమిత్షా అన్నారు.
ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేందుకే ఈసీని వాడుకుంటున్నారని, క్షేత్ర స్థాయిలో ఎన్నికల సంస్కరణలు అమలు కావడం లేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈసీ నియామకంలో మోదీ, అమిత్షాకు ఎందుకంత ఆసక్తి అని ప్రశ్నించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నేళ్లుగా పదవిలో కొనసాగుతున్నారో అన్నేళ్లపాటు దేశ స్వాతంత్ర్య కోసం జవహర్ లాల్ నెహ్రూ జైలు జీవితం గడిపారని ప్రియాంక గాంధీ గుర్తుచేశారు.
లోక్సభలో వందేమాతరం గేయంపై చర్చ జరగడాన్ని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ తప్పుబట్టారు. బీజేపీ ఎంపీలు పదే పదే ఆ విషయమై చర్చించడం.. బెంగాల్లో రాబోయే ఎన్నికలకు ఆజ్యం పోసినట్టుందని విమర్శించారు.
ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారని, వాటి గురించి ప్రధాని ఒక్క మాట కూడా మాట్లాడరని, ఢిల్లీ పేలుళ్ల ప్రస్తావనే లేదని, ఢిల్లీ అయినా పహల్గాం అయినా ప్రజలను రక్షించే పరిస్థితిలో మనం లేమని గౌరవ్ గొగోయ్ విమర్శించారు.
లోక్సభలో వందేమాతరం 150 ఏళ్ల ఉత్సవాలపై సోమవారం చర్చ జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ వందేమాతర గీతం గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. వందేమాతరంపై చర్చలో పాల్గొన్నందుకు గర్వపడుతున్నానని అన్నారు.
స్వాతంత్ర్య పోరాటానికి స్ఫూర్తినిచ్చిన బంకించంద్ర ఛటర్జీ 'వందేమాతర గీతం' చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతపై లోక్సభలో చర్చ ఉంటుంది.
తెలంగాణతో పాటు దేశంలో చాలా రాష్ట్రాల్లో కోతుల సమస్యలపై బీజేపీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి పార్లమెంట్ లో ప్రస్తావించారు. ఈ సమస్య తమ శాఖ కిందకు రాదని ప్రభుత్వ శాఖలు తప్పించుకుంటున్నాయని చెప్పుకొచ్చారు. వానరాల సమస్య ఏ శాఖ కిందకు వస్తుందో చెప్పాలని ప్రశ్నించారు.