Home » Kuwait
కువైట్ విద్యుత్, నీటి శుద్ధి కర్మాగారంపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. ఈ పేలుడులో ఒక భారతీయుడు మృతి చెందారు. పరిస్థితిని చక్కదిద్దడానికి అత్యవసర చర్యలు చేపట్టారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, పుకార్లు వ్యాప్తి చేయవద్దని కువైట్ ప్రభుత్వం ప్రజలకు విన్నవించింది.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు రోజు రోజుకీ భీకర స్థాయికి చేరుకుంటున్నాయి. యుద్ధం మొదలైనప్పటికి నుంచి గల్ఫ్ దేశాలపై ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడుతోంది. తాజాగా కువైట్ ఎయిర్ పోర్ట్పై డ్రోన్తో దాడికి పాల్పడింది.
కువైట్ సమీప సముద్రంలో ఆయిల్ ట్యాంకర్లో భారీ పేలుడు సంభవించింది. ముబారక్ అల్-కబీర్ పోర్టుకు సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు యూకే మెరైన్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అధికారులు వెల్లడించారు.
ఇరాన్-అమెరికా యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల్లోనూ పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. బహ్రెయిన్ రాజధాని మనామాకు వెళ్లిన హైదరాబాద్ రాంనగర్కు చెందిన పలువురు భయం భయంతో అక్కడ కాలం గడుపుతున్నారు.
బతుకుదెరువు కోసం కదిరి ప్రాంతం నుంచి వందలాది మంది గల్ఫ్ దేశాలకు వలస కార్మికులుగా వెళ్లారు. ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో గల్ఫ్ దేశాలకు వెళ్లిన కదిరి వాసుల కుటుంబికులు ఆందోళన చెందుతున్నారు.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం నగరవాసులను కూడ వణికిస్తోంది. దుబాయ్ విమానాశ్రయం మూసివేతతో పర్యాటకం, వ్యాపారాలు, ఉన్నత విద్య, వైద్యం కోసం వెళ్లిన వారిలో సుమారు 24.4వేలకు పైగా భారతీయులు అక్కడే చిక్కుకున్నారు.
కువైత్ గగనతల రక్షణ వ్యవస్థ పొరపాటున జరిపిన దాడిలో అమెరికాకు చెందిన మూడు ఫైటర్ జెట్స్ కూలిపోయాయని అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ ఒక ప్రకటనలో తెలిపింది.
గల్ఫ్ దేశాల్లో మూడోరోజు ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కువైట్లో ఓ అమెరికా యుద్ధ విమానం కూలిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇద్దరు భారతీయులు డ్రగ్స్ అక్రమ రవాణా చేశారన్న తీవ్రమైన నేరారోపణపై విచారణ జరిపిన కువైట్ లోకల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. వారికి మరణ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా సయ్యద్ నాజర్.. మౌలానా అబుల్ కలాం అజాద్ 2025 అవార్డు అందుకున్నారు. ఆయనకు ఎన్.ఆర్. ఐ టీడీపీ కువైట్ గల్ఫ్ కౌన్సిల్ సభ్యుడు శ్రీ వెంకట్ కోడూరి అధ్యక్షతన అభినందన సభ ఘనంగా జరిగింది